Job Notification: ఏపీ నిరుద్యోగ మహిళలకు సర్కార్ శుభవార్తను. ఆంధ్రప్రదేశ్లోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రిన్సిపాల్, సి ఆర్ టి, పిజిటి పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏకంగా 1358 ఖాళీగా ఉన్న పోస్టులను బట్టి చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆసక్తి గల మహిళ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుకు అర్హులని ప్రకటించారు.
ఇక ఈ ఉద్యోగాలకు భర్తీ చేసుకోవాలి అంటే సంబంధిత సబ్జెక్టుల వారీగా డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. కేవలం 18 నుంచి 48 సంవత్సరాల వయసు గల మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్92, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు 846, సి ఆర్ టి పోస్టులు 374, పి ఈ టి 46 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 29 ప్రారంభమై జూన్ 4న ముగియనుంది.
రోజు రాత్రి 11:59 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. http://apkgbv.apcfss.in/ వెబ్ సైట్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే సంబంధిత అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.