TikTok Star: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ.. సైబర్ నేరాలను పోలీసులు అరికట్టలేకపోతున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఓ యువతి పెళ్లి చేసుకుంటానని చెప్పి.. నమ్మిన యువకులను నిండా ముంచుతోంది. ఏకంగా రూ.31 లక్షల 66 వేలు లూటీ చేసింది. ఓ యువకుడు హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. ఈ తతంగం బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంకు చెందిన పరసా తనుశ్రీ టిక్టాక్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. టిక్టాక్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఫ్యాన్ ఫాలొయింగ్ను సంపాదించుకుంది. టిక్టాక్ బ్యాన్ అయినా.. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తూ స్టార్ క్రేజ్ను కొనసాగించింది. ఇన్స్టాగ్రామ్లో Sritinsu, sri_tinsu, sri.tinsu, lucky_sritinsu అనే నాలుగు అకౌంట్లు మెయిన్టైన్ చేస్తూ మరింతగా రెచ్చిపోయింది. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. మంచి పాపురాలిటీని సంపాదించుకుంది. ఆమె అందానికి ఫిదా అయిన కొందరు యువకులు ఆమెకు ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్’ అని కామెంట్ పెడితే చాలు.. ‘మీరూ నాకు బాగా నచ్చారు. పెళ్లి చేసుకుందామా?’ అని మాటలు కలిపేది. అలా తను శ్రీ.. మెల్లిమెల్లిగా ఆ యువకులను పూర్తిగా తన వలలో వేసుకుంటుంది. తన తల్లి ఆరోగ్యం బాగా లేదని, తన ఆరోగ్యం క్షీణించిందని మాయమాటలు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు పంపమని చెప్పి.. డబ్బులు కాజేస్తుంటుంది. అలా ఓ వ్యక్తితో రూ.33.66 లక్షలు కొల్లగొట్టింది. మోసపోయానని గుర్తించి వ్యక్తి సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని తను శ్రీని, తన బాయ్ ఫ్రెండ్ను అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
లగ్జరీ లైఫ్కు అలవాటు పడ్డ.. తను శ్రీ తన బాయ్ఫ్రెండ్తో కలిసి ఈ పన్నాగం పన్నుతున్నట్లు పోలీసులు తెలిపారు. లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ యువకులను ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అలా ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన చాలా మంది దగ్గర డబ్బులు కాజేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి మోసగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందం చూసి మోసపోకూడదని సలహా ఇస్తున్నారు. డబ్బులు అడిగితే.. గుడ్డిగా నమ్మకుండా దూరం పెట్టాలని చెబుతున్నారు.