Tripti: యానిమల్ సినిమా ద్వారా హీరోయిన్ కన్నా ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది తృప్తి డిమ్రి. అంతకుముందు ఆమె చాలా సినిమాలు చేసింది కానీ యానిమల్ సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడి పేరు వాడుకోకుండా ఏ మీడియా సంస్థ లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు యానిమల్ సినిమా ఓటీటీ లోకి వచ్చాక ఆమె మళ్ళీ భారీగా వైరల్ అవుతుంది.
సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తృప్తి డిమ్రి జోయ అనే పాత్రలో స్క్రీన్ పై కనిపించింది. కనిపించింది కొద్ది సమయమే అయినప్పటికీ ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా రణబీర్, తృప్తి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా వైరల్ అయ్యాయి.ఏదో ఒక సందర్భంలో ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త టెలికాస్ట్ అవుతుంది. ఒక్క యానిమల్ సినిమాతో సాధించిన పేరుతో అమ్మడికి బాలీవుడ్ నుంచే కాక సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా వరుస ఆఫర్లు ఆమె ఇంటి తలుపు తడుతున్నాయి.
ఈ క్రమంలోనే ఆమె ఇప్పటికే రెండు తెలుగు చిత్రాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. మరొక నాలుగు బాలీవుడ్ చిత్రాలను లైన్లో పెట్టినట్లు సమాచారం. ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఈమె డేటింగ్ లో ఉందంటూ చెవులు కొరుక్కుంటున్నారు నెటిజన్స్.
ఇక ఆమె పెళ్లి గురించి ఒక ఇంటర్వ్యూలో తృప్తి డిమ్రి మాట్లాడుతూ తన మనసులో మాటని బయటపెట్టింది. ఇప్పటిలో తనకు పెళ్లి చేసుకోవాలని కోరిక లేదని ప్రస్తుతానికి నా కెరియర్ పైన దృష్టి పెట్టానని 2030 తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని స్పష్టం చేసింది. అయితే నాకు కాబోయే భర్తకు చిల్లి ఇవ్వలేకపోయినా పర్వాలేదు కానీ మంచి మనసు ఉండి అవతలి వారిని అర్థం చేసుకునే గుణం ఉంటే చాలు అని తెలిపింది.