Chandra Babu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని అన్ని పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున కష్ట పడుతున్నారు. ఇకపోతే రాయలసీమలో తెలుగు దేశం పార్టీకి కంచు కోటగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో భాగంగా తెలుగు దేశం పార్టీ రెండు నియోజకవర్గాలలో మాత్రమే గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికలలో మాత్రం రాయలసీమలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్లీప్ చేయాలని అడుగులు వేస్తోందని తెలుస్తుంది.
ఇప్పటికే ఒకవైపు చంద్రబాబు నాయుడు మరోవైపు లోకేష్ పాదయాత్రలు రోడ్ షోలు చేస్తూ తమ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇక రాయలసీమలో మాత్రం ఈసారి తెలుగుదేశం పార్టీ అన్ని ప్రాంతాలలోనూ తమ పార్టీ జెండా ఎగరవేయాలి అన్న ఉద్దేశంతోనే మరోసారి ఈ జిల్లాలలో చంద్రబాబు నాయుడు పర్యటించడమే కాకుండా కీలక నేతలను ఈసారి రంగంలోకి దింపబోతున్నారని తెలుస్తోంది.
ఇక సీమలో తెలుగుదేశం నాయకులు కూడా ముందుకంటే ఈసారి ఉత్సాహం ఎక్కువగా కనపరుస్తున్నారు ఎలాగైనా అధికారం అందుకోవాలని ఆత్రుత నాయకులలో కూడా కనపడుతుంది. తాజాగా చంద్రబాబు నాయుడు పర్యటనలలో భాగంగా కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ఈసారి టిడిపి తరఫున పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా వైసిపి నాయకులను ఢీకొట్టే విధంగా ఉండేలా సరైన అభ్యర్థులను ఎంపిక చేసే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది ఏది ఏమైనా ఈసారి ఎన్నికలలో మాత్రం సీమలో హవా కొనసాగించాలనే దిశగా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ చేశారని వచ్చే ఎన్నికలలో సీమలో తమ పార్టీ గెలపొందడం ఖాయం అనే తెలుస్తుంది.