Nara Bhuvaneshwari: ఎన్నికల త్వరలోనే రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటంతో ఎన్నికల వేడి తగులుతుంది ఈ క్రమంలోనే ఎన్నికల వాతావరణంతో వేడెక్కినటువంటి వారికి నారా భువనేశ్వరి తన మాటలతో కాస్త ఊరడింపు ఇచ్చారు. ఇటీవల ధర్మవరంలో న్యాయం గెలవాలి అనే పేరిట సభను నిర్వహించగా నారా భువనేశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొని చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజల మనిషి ఆయన ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటారు. ఆయన ముందు ప్రజల మనిషి అని ఆ తర్వాతే తనకు భార్య పిల్లలు కుటుంబం గుర్తుకు వస్తుందని భువనేశ్వరి తెలిపారు. ఇలా తరచూ ప్రజల కోసం ఆలోచించే ఈయన ఇప్పటివరకు నాకోసం కనీసం ఎలాంటి చిరు కానుక కూడా తీసుకురాలేదని తెలిపారు.
ఈ విషయం గురించి నేను ఒకసారి బాబు గారితో మాట్లాడుతూ ఇన్నేళ్ల మన ప్రయాణంలో ఎప్పుడైనా నాకు అంటూ ఒక చీరని తీసుకువచ్చారా అంటూ ప్రశ్నించాను అయితే ఆ విషయాన్ని బాబు గారు గుర్తు పెట్టుకొని తనకోసం ఒక చీర తీసుకొని వచ్చారని భువనేశ్వరి తెలిపారు. ఆ చీర చూడగానే నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయింది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు నాయుడు గారు తనకోసం తీసుకువచ్చిన చీర చాలా ఘోరంగా ఉందని కానీ ఆయన నా కోసం నన్ను గుర్తు పెట్టుకొని ఎంతో ప్రేమగా తీసుకురావడంతో ఆ చీరని ఇప్పటికి అలాగే భద్రంగా దాచుకున్నాను అంటూ ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ధర్మవరం సభలో చీరల గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.