Mirror: ఈ మాయా అద్దంతో వాళ్లను నగ్నంగా చూడొచ్చట.. చివరికి ఏం జరిగిందంటే?

Mirror: మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్లు కూడా అధికమవుతారనే విషయం మనకు తెలిసిందే.ఎంతోమంది డబ్బు సంపాదించడం కోసం ఏమీ తెలియనటువంటి అమాయకులను టార్గెట్ చేస్తూ భారీగా మోసం చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి మోసాలకు గురవుతూ భారీగానే నష్టపోతూ ఉంటారు.

 

తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.ఉత్తరప్రదేశ్ కు చెందిన 72 సంవత్సరాల వృద్ధుడు అవినాష్ కుమార్ అనే వ్యక్తి వద్దకు ముగ్గురు యువకులు వెళ్లి వారు పురాతన వస్తువులను సేకరించే వారమని తెలియజేశారు. అయితే తమ వద్ద పురాతన కాలానికి చెందినటువంటి ఒక మాయ అద్దం ఉందని తెలిపారు.

ఈ అద్దంలో మనం ఎవరినైనా చూస్తే వారు మనకు నగ్నంగా కనపడటమే కాకుండా వారి భవిష్యత్తు కూడా తెలిసిపోతుంది అంటూ ఆ వృద్దుడిని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఆ వృద్ధుడు మొదట్లో వీరి మాటలను నమ్మలేదు కానీ వారు మాత్రం మేము నాసా శాస్త్రవేత్తలకు కూడా అమ్మామని మాయమాటలు చెప్పారు. ఈ అద్దం విలువ ప్రస్తుతం రెండు కోట్ల రూపాయలు విలువ చేస్తుందని తెలిపారు.

 

ప్రస్తుతం ఈ మాయ అద్దాన్ని తాము తొమ్మిది లక్షలకే అందిస్తున్నామంటూ అవినాష్ కుమార్ అనే వ్యక్తిని నమ్మించారు. ఇలా తొమ్మిది లక్షల రూపాయలకే ఈ అద్దం సొంతం చేసుకోవచ్చన్న ఉద్దేశంతో అవినాష్ తొమ్మిది లక్షలు చెల్లించి తీసుకున్నారు అయితే తాను మోసపోయానని గ్రహించినటువంటి అవినాష్ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు నిందితులను పశ్చిమ బెంగాల్ లో అరెస్టు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -