Bollywood: ముగ్గురు స్టార్ హీరోలతో ఎఫైర్ పెట్టుకున్న ఈ ప్రముఖ నటి ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Bollywood: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఒకరితో రిలేషన్ లో ఉన్న తర్వాత బ్రేకప్ అయిన తర్వాత మరొకటి తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అన్నది కామన్ అయిపోయింది. ఒకరితో విడిపోవడం మరొకరితో రిలేషన్ స్టార్ట్ చేయడం అన్నది సినిమా ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే కొన్ని సెలబ్రిటీ జంటలు పెళ్లి వరకు వెళ్లి కూడా ఆగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రముఖ నటి ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలతో ఎఫైర్ పెట్టుకుందట. ఇంతకీ ఆ అది ఎవరు ఆ ముగ్గురు హీరోలు ఎవరు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దక్షిణాది నుంచి హిందీ సినీ పరిశ్రమకు వెళ్లడమే కాకుండా అక్కడ రాణిలా స్టార్ డమ్ తెచ్చుకొన్న హీరోయిన్లలో రేఖ ఒకరు. 80, 90 దశకంలో రేఖ హీరోయిన్ గా ఒక వెలుగు వెలగడంతో పాటు ఆమె సినిమా విడుదల అవుతుంది అంటే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. ముఖ్యంగా తన అందచందాలతో యువతకు పిచ్చెక్కించేది. వెండితెరపై సూపర్ స్టార్‌గా వెలిగినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమెకు అన్నీ చేదు అనుభవాలే మిగిలాయి. చివరకు ఒంటరితనంతో బతుకుతూ దాంపత్య జీవితానికి దూరంగా ఆమె జీవితాన్ని వెళ్లదీస్తోంది. కాగా రేఖ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతూనే పలువురు హీరోలతో ప్రేమాయణాన్ని కొనసాగించింది.

 

అయితే రేఖ జీవితంతో ఎక్కువ కాలం ముడిపడి ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రమే అని చెప్పవచ్చు. అమితాబ్‌ బచ్చన్ తో ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చినట్టే వచ్చి ఆగిపోయింది. అమితాబ్‌తో బ్రేకప్ తర్వాత పలువురు హీరోలతో అఫైర్ రూమర్లు గట్టిగానే వినిపించాయి. రేఖతో అఫైర్ రూమర్లు వచ్చిన వారిలో ప్రధానంగా వినోద్ మెహ్రా, అక్షయ్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపస్తాయి. వినోద్ మెహ్రాతో చాలా కాలం అఫైర్ నడిచిందని గట్టిగా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అక్షయ్ కుమార్, రేఖ మధ్య కూడా అలాంటే ప్రేమ కథే నడిచిందని చెప్పుకొంటారు. ఈ ఇద్దరే కాకుండా మరికొంత మంది హీరోలతో లింకులను మీడియా అంటగట్టాయి. ఉత్తరాదిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్‌తో రేఖ వివాహం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖేష్‌తో దాంపత్య జీవితం అంతా సవ్యంగా కొనసాగుతుందని అనుకొంటుండగా భర్త అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం సంచలనం రేపింది. భర్త ముఖేష్ మరణం తర్వాత రేఖ మళ్లీ వైవాహిక జీవితం వైపు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఇప్పటికీ ఆమె ఒంటరిగానే జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -