1 Crore TV: సాంసంగ్ భారతదేశంలో తన అల్ట్రా ప్రీమియం మైక్రో ఎల్ఈడి టెలివిజన్ ను ప్రారంభించింది. శక్తివంతమైన రంగులు పదునైన కాంట్రాస్ట్ మరియు లైఫ్ లైక్ ప్రాతినిధ్యంతో లీనమయ్యే వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. మైక్రో ఎల్ఈడి టెలివిజన్ సొగసైన డిజైన్, శక్తివంతమైన రంగులు, పదునైన కాంట్రాస్ట్ మరియు లైఫ్ లైక్ పిక్చర్ క్వాలిటీ అలాగే లీనమయ్యే త్రీడి సౌండ్ ని అందిస్తుంది.
సాంసంగ్ తన అధునాతన సాంకేతికత మరియు ఫీచర్లతో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నాలుగు మూలాల నుంచి కంటెంట్ వీక్షణను అనుమతించే మల్టీ వ్యూ మరియు ఇండోర్ లైటింగ్ ఉపయోగించి ఛార్జ్ చేయగల సోలార్ సెల్ రిమోట్ వంటి ప్రత్యేక ఫీచర్లని కలిగి ఉంది. సొగసైన డిజైన్ తో ఈ మైక్రో ఎల్ఈడి టెలివిజన్ అల్ట్రా ప్రీమియం వీక్షణ అనుభవాన్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.
నీలమణి మెటీరియల్ నుండి రూపొందించబడింది. భూమిపై రెండవ అత్యంత కఠినమైన పదార్థం ఇది. మైక్రో ఎల్ఈడి శక్తివంతమైన రంగులతో మరియు అధిక స్థాయి స్పష్టత మరియు కాంట్రాక్టులతో లీనమయ్యే వీక్షణా అనుభవాన్ని అందిస్తుంది. ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ విలాసవంతమైన ఎల్ఈడి టెలివిజన్ రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. దాని రేటు అక్షరాల 1,14,99000 రూపాయలు. మైక్రో ఎల్ఈడి టెలివిజన్ లైఫ్ లైక్ కలర్ రెప్రెజెంటేషన్, షార్ప్ కాంట్రాస్ట్ ఆప్టిమమ్, పీక్ బ్రైట్నెస్ మరియు అద్భుతమైన ఏ వన్ అప్ స్కేలింగ్ ని అందిస్తుంది.
120 ఎఫ్ టి ఎస్ వరకు సహజమైన ఫోర్ కే రిజర్వేషన్లు, గరిష్టంగా నాలుగు విభిన్న మూలాల నుండి కంటెంట్ వీక్షించటానికి అనుమతించే మల్టీ వ్యూ ఫీచర్ కూడా ఉంది. అంతేకాకుండా మైక్రో ఎల్ఈడి సోలార్ సెల్ రిమోట్ వస్తుంది. ఇది స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో శాంసంగ్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ బ్యాటరీ రహిత రిమోట్ ని కేవలం ఇండోర్ లైటింగ్ ని ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. పర్యావరణ స్పృహ కలిగిన వినియోగదారులకు ఇది ఒక స్మార్ట్ ఎంపిక.