Samantha-Nagarjuna: మూర్ఖత్వంతో సైలెంట్ గా ఉన్న నాగ్.. పట్టింపులు అవసరమా?

Samantha-Nagarjuna: సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని సోషల్ మీడియాలో తెలిపిన విషయం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనిపై వరుసగా అందరూ స్పందిస్తున్నారు. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి చిరు వరకు అందరూ సోషల్ మీడియాలో స్పందించారు. అయితే, కొంత కాలం అక్కినేని ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేసినా ఆ ఇద్దరూ స్పందించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

నాగ్, చై స్పందించలేదేంటో..

సమంత మయాసిటిస్ వ్యాధితో బాధపడుతోందని తెలిపినప్పటి నుంచి ఆమె ఫ్యాన్స్ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ జబ్బు చాలా అరుదుగా కొందరికే వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రేమించి, తర్వాత పెళ్లి చేసుకొని, ఓ నాలుగేళ్లు కాపురం చేసిన మాజీ భర్త నాగ చైతన్య, మాజీ మామ అక్కినేని నాగార్జున.. ఇద్దరూ సమంత జబ్బు గురించి, ఆమె పడుతున్న ఇబ్బంది గురించి స్పందించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఓవైపు బిగ్ బాస్ షోలో నాగార్జున బిజీగా ఉన్నారు. నాగచైతన్య కూడా సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నాడు. అయితే, ఎంత బిజీగా ఉన్నా కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా మాజీ కోడలు గురించి ఓ చిన్న సందేశం పంపి ఉంటే ఫ్యాన్స్ తో పాటు సమంత కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది కదా.. అని ఫ్యాన్స్ అంటున్నారు. కుటంబంలో ఇబ్బందులు, వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నప్పటికీ సాటి మనిషిగా గా కూడా స్పందించలేదనే అభిప్రాయాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

మాజీ మరిది అక్కినేని అఖిల్ కూడా స్పందించి సమంత త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు. కలిసి కాపురం చేసి విడిపోయిన నాగచైతన్య కూడా ఓ ట్వీటో, ఫోనో చేసి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. మాజీ కోడలు అని కాకపోయినా సినిమాల్లో నటించిన హీరోయిన్ గా అయినా కనీసం కింగ్ నాగ్ స్పందించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూర్ఖత్వంతో పట్టింపులకు పోవడం సరైంది కాదంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -