Mahesh: మహేష్ బాబు మామ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Mahesh: సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వీరిలో మహేశ్‌బాబు, నమ్రత జోడీ అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్. వంశీ సినిమాలో తనతో కలిసి నటించిన హీరోయిన్ నమ్రతను మహేశ్‌బాబు పెళ్లి చేసుకున్నాడు. వీరిపెళ్లికి మొదట ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోయినప్పటికీ.. తర్వాత వారి ప్రేమకే ఓటేశారు. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పింది. పిల్లలను, ఇంటిని చూసుకోవడంలో బిజీగా మారింది. ఇప్పుడిప్పుడే కొన్ని బిజినెస్‌లలో అడుగుపెడుతోంది.

 

అయితే పెళ్లి అయి ఇన్నేళ్లయినా ఆమె ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులు పెద్దగా తెలియదు. నమ్రత 1977 జనవరి 22న ముంబైలో జన్మించింది. మహారాష్ట్రలోని చదువంతా సాగింది. ఆమె తండ్రి నితిన్ శిరోద్కర్. అప్పట్లో ఆయన ఫేమస్ క్రికెటర్. ముంబై తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

 

అప్పట్లో ఆయన ఆటతీరు చూసిన వారంతా షాక్ అయ్యేవారంట. దిలీప్ వెంగాసర్కార్, సునీల్ గ‌వాస్క‌ర్ లాంటి స్టార్ క్రికెటర్లతోనూ నితిన్ శిరోద్క‌ర్ క్రికెట్ ఆడేవారు. ఆయన బ్యాటర్ గానే కాదు బెస్ట్ బౌలర్‌గా రాణించారు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఛాన్స్ దక్కకపోవడంతో బిజినెస్‌లవైపు మొగ్గు చూపారు.

 

తల్లి కూడా మోడల్..
న‌మ్ర‌త‌ తల్లి వనిత కూడా కూడా మోడల్‌గా రాణించారు. ఆ తర్వాత నమ్రత కూడా మోడలింగ్‌లోనే కెరీర్ ఆరంభించింది. 1993లో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. మిస్ యూనివర్స్ పోటీలకు సైతం నమ్రత ఎంపికయ్యింది. మిస్ యూనివర్స్ గా 5వ స్థానంలో నిలిచింది. 1998 లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నమ్రత. ఆ తర్వాత తెలుగులో మహేశ్‌బాబు సరసన వంశీ సినిమాలో నటించడం, అతన్నే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -