Marriage: చికెన్ పెట్టలేదు అంటూ పెళ్లిలో లొల్లి పెట్టిన వరుడు ఫ్రెండ్స్.. చివరికి ఏం జరిగిందంటే?

Marriage: ఇద్దరు జంటలకు పెళ్లి కుదిరిచినప్పటి నుండి ఆ పెళ్లి అయ్యేదాకా ఎటువంటి మర్యాదలు తక్కువ కాకుండా చూడాలని అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ మధ్యవర్తులు మాత్రం ఎలా గొడవ క్రియేట్ చేయాలా అని చూస్తూ ఉంటారు. కొందరు మాత్రం కావాలని మరి గొడవ పెట్టుకొని పెళ్లి పెటాకులు చేస్తారు.

అయితే ఇటువంటివి చాలా తక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటాయి. చాలావరకు ఇతర రాష్ట్రాలలో ఇటువంటివి బాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం చాలావరకు ఇటువంటి గొడవలు రానివ్వకుండా మర్యాదల విషయంలో జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ ఈ సారి మన తెలుగు రాష్ట్రంలో వరుడు ఫ్రెండ్స్ చేసిన పనికి పెళ్లి పెటాకులు అయ్యాయి.

మామూలుగా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చామా.. గిఫ్ట్ పెట్టామా.. భోజనం చేసామా అన్నట్లు ఉండాలి కానీ. ఎవరికి లేని సమస్య తమకే ఉన్నట్లుగా ఫీల్ అవుతూ కొందరు ఫ్రెండ్స్ రచ్చ రచ్చ చేస్తుంటారు. అయితే తాజాగా పెళ్లిలో చికెన్ పెట్టలేదు అని చాలా ఆమర్యాదకరంగా ప్రవర్తించారు వరుడు ఫ్రెండ్స్.

ఇంతకు అసలు విషయం.. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో జగద్గిరిగుట్ట కు చెందిన వరుడుతో కుత్బుల్లాపూర్ కు చెందిన వధువుకు పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. అయితే మరి కొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇక అమ్మాయి తరపున వాళ్లు శాకాహారం భోజనం పెట్టగా ఆ సమయంలో వరుడు ఫ్రెండ్స్ చికెన్ పెట్టలేదు అని రచ్చకు దిగారు.

ఇంకేముంది.. ఈ ఫ్రెండ్స్ పెట్టిన చిచ్చుకు ఇరుపక్షాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకి దారితీసింది. చివరికి కొట్టుకునే పరిస్థితి వరకు కూడా వెళ్లారు. దీంతో పెళ్లి కూడా ఆగిపోయింది. కొద్ది క్షణాల్లో ఫ్రెండ్ ఒక ఇంటి వాడు అయిపోయేవాడు. అనవసరంగా ఫ్రెండ్ లైఫ్ తో ఆడుకున్నారు ఈ ఫ్రెండ్స్.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -