Lakshmi Devi: ఈ విధంగా ఉప్పుతో సులువుగ ఐశ్వర్యాన్ని పొందవచ్చా.. ఏం చేయాలంటే?

Lakshmi Devi: ఉప్పును మనం ప్రతి రోజు ఉపయోగిస్తూనే ఉంటాం. ఆహారం రుచిని పెంచడానికి ఉప్పు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మనం తినే చాలా రకాల ఆహార పదార్థాలలో ఉప్పు లేకపోతే తినడానికి కూడా ఇష్టపడరు. అలా అని ఉప్పు ఎక్కువ తింటే ఆరోగ్య సమస్యలు తప్పవు. అయితే ఉప్పు కేవలం ఆహార పదార్థాలలో మాత్రమే కాకుండా జ్యోతిష్యంలో కూడా ఉప్పుని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ఉప్పుకు చాలా ప్రధాన్యత కూడా ఉంది. చాలా ప్రదేశాలలో దిష్టి తీయడానికి ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు.
గ్రంధాలలో, ఉప్పును చంద్రుడు శుక్రుడు కారకంగా పరిగణిస్తారు. ఉప్పు మనిషికి సంబందించిన అన్ని సమస్యలను నయం చేస్తుంది.

ఆర్థిక సమస్యలను తొలగించడం నుండి గృహ సమస్యలను తొలగించడం వరకు ఉప్పును ఉపయోగిస్తారు. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఉద్యోగ పురోగతి చాలా కాలం నుండి స్తబ్దుగా ఉంటే, ఇంటిని శుభ్రపరిచేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసుకోవడం మంచిది. మీరు దీన్ని ప్రతిరోజూ చేయవలసిన అవసరం లేదు. మీరు దీన్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయవచ్చు. ఇంట్లో ఉప్పునీరు రాస్తే ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. దీనితో పాటు, ఉప్పును అప్లై చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది..మీ ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగిందని మీరు భావిస్తే, మీరు ఒక గాజు కప్పులో ఉప్పును నింపి మీ ఇంటి టాయిలెట్ బాత్‌రూమ్‌లో ఉంచవచ్చు.

 

ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ నశిస్తుంది. అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం చిన్నపిల్లలకు స్నానం చేసేటప్పుడు పిల్లలను దిష్టి నుండి రక్షించడానికి వారానికి ఒకసారి మీరు నీటిలో చిటికెడు ఉప్పుతో పిల్లలకు స్నానం చేయవచ్చు. శాస్త్రీయ దృక్కోణంలో ఉప్పునీటితో స్నానం చేయడం వల్ల పిల్లలకు అలర్జీ సంబంధిత వ్యాధులు దరిచేరవు. మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే, మీరు ఉప్పును ఒక గాజు పాత్రలో వేసి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తల దగ్గర ఉంచండి. వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చి మళ్లీ కొత్త ఉప్పు వేయండి. ఇలా చేయడం వల్ల మనిషి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. కుటుంబ ఆర్థిక ప్రగతి కోసం గాజు పాత్రలో కాస్త ఉప్పు తీసుకుని అందులో నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో మూలన పెట్టాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -