Lakshmi Devi, Hanuman: మామూలుగా చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ చేతిలో డబ్బులు మిగడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యలు కలగకుండా ఉండడం కోసం చాలామంది లక్ష్మీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. అటువంటి వారు కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవడం తప్పనిసరి. సంపదకు అది దేవత లక్ష్మీదేవి. అలానే హనుమంతుడు ధైర్యాన్ని ఇస్తాడు. అయితే, మనం కొన్ని మంత్రాలని జపించడం, కొంతమంది దేవుళ్ళని ఆరాధించడం వలన బాధల నుండి విముక్తి పొందవచ్చు.
లక్ష్మీదేవిని, హనుమంతుడిని పూజించడం వలన చాలా బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. లక్ష్మీదేవిని, హనుమంతుడుని పూజించడం వలన పలు రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. డబ్బు, వాస్తు సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే, లక్ష్మీదేవిని, హనుమంతుడిని ఆరాధించడం మంచిది. లక్ష్మీదేవిని హనుమంతుడిని ఆరాధిస్తే, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు హనుమాన్ మంత్రాన్ని జపిస్తే మంచిది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధమతం వారిష్టం.. వటతమజం వానరాయకామ్యముక్కం శ్రీరామ దత్తం సర్ణ సర్పణం.
పురుషులు ఈ మంత్రాన్ని జపించి, హనుమంతుడిని ఆరాధించవచ్చు. స్నానం చేసాక కానీ రాత్రి అయినా కానీ ఈ మంత్రాన్ని పఠించవచ్చు. లక్ష్మీదేవి ప్రతిమని ఇంట్లో పెట్టి ఉదయం, సాయంత్రం అమ్మవారికి దీపం వెలిగించాలి. తులసి మొక్క దగ్గర అయినా దీపం పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే, ఆర్థిక బాధలు ఉండవు. ఆమె తామర పువ్వు మీద ఉంటుంది. తామర పువ్వు సంపదకు చిహ్నం. తామర పువ్వుని పూజ గదిలో పెట్టి, లక్ష్మీ మంత్రాన్ని జపిస్తే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు. ఓం మహాలక్ష్మీయే నమః అని 11 సార్లు జపిస్తే ధనవంతులు అవ్వడం ఖాయం. హనుమంతుడిని పూజించేటప్పుడు ఎర్రని పూలు, ఎర్రని వస్త్రాలు, స్వీట్లు పెట్టడం మంచిది.