Niharika Konidela: షాకింగ్ కామెంట్స్ చేసిన నిహారిక.. వాళ్ల గురించి పట్టించుకోనంటూ?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నాగబాబు కుమార్తెగా యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నీహారిక అనంతరం నటిగా పలు సినిమాలలో నటించారు. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయినా నిహారిక అనంతరం వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. అయితే ప్రస్తుతం తిరిగి ఈమె తన సినీ కెరియర్ పై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఇలా సినిమా ఇండస్ట్రీలోకి తిరిగి నిహారిక రావడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించడమే కాకుండా పలు వెబ్ సిరీస్ ల లోను సినిమాలలోను నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈమె నటించిన డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ మే 19వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నిహారిక తన గురించి సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ పై స్పందించారు.

 

ఈ సందర్భంగా నిహారిక తన గురించి వచ్చే రూమర్స్ గురించి స్పందిస్తూ సోషల్ మీడియాలో ఎంతోమంది పని పాట లేని ఎదవలు నా గురించి కామెంట్స్ చేస్తే నేను పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని తెలిపారు అలా చేయడం వల్ల నేను వారికి అటెన్షన్ ఇచ్చినట్టు అవుతాను. మొదట్లో ఈ రూమర్స్ కాస్త చదివేదాన్ని అయితే ప్రస్తుతం ఏమాత్రం పట్టించుకోనని తెలిపారు.

 

ఇక నేనంటే ఇష్టం ఉన్నవారు చాలామంది ఉన్నారు నాకు ఏమాత్రం సమయం దొరికిన వారితో స్పెండ్ చేయడానికి ఇష్టపడతానే తప్ప ఎవడో కోన్ కీస్ గొట్టం గాడు ఏదో అన్నాడనివాటి గురించి ఆలోచిస్తూ నా టైం వేస్ట్ నేను చేసుకోలేనని అందుకే సోషల్ మీడియా రూమర్స్ కు చాలా దూరంగా ఉంటానని ఈ సందర్భంగా నిహారిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -