Keerthi: నటి కీర్తి నిశ్చితార్థం.. పిల్లలు కలగరని తెలిసినా?

Keerthi: తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటి బిగ్ బాస్ బ్యూటీ కీర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. అయితే బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అంతేకాకుండా బిగ్ బాస్ షో ద్వారా బోలెడంత పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు సింపతీని కూడా సంపాదించుకుంది కీర్తి. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ మా లో ప్రసారమవుతున్న మధురానగరిలో అనే సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తోంది కీర్తి. ఇకపోతే కీర్తి కి తన అనుకున్న వారు ఎవరూ లేరు అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ విషయాన్ని ఆమె బిగ్ బాస్ లో చాలాసార్లు ప్రస్తావిస్తూ ఎమోషనల్ కూడా అయ్యింది. కీర్తి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్తను తాజాగా ఆమె తెలిపింది. త్వరలోనే కీర్తి పెళ్లి పీటలు ఎక్కనుంది. నటుడు కార్తీక్‌తో కీర్తి ఏడడుగులు వేయనుంది. ప్రస్తుతం ఈ జంట నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో సోషల్ వైరల్ గా మారింది. ఇక విజయ్ కార్తీక్ తోటతో కీర్తి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ప్రోమోలో కీర్తి, కార్తీక్ దండలు మార్చుకున్నారు. నీకు నేను తోడుగా ఉంటాను.. నీ తల్లిదండ్రులను నా పేరెంట్స్ అనుకుంటా, నన్ను వదలకుండా ఇలాగే చూసుకో అంటూ కంటతడి పెట్టుకుంది కీర్తి.

 

తర్వాత ఈ జంట రింగ్స్ మార్చుకున్నారు. కార్తీక్ పేరెంట్స్ గురించి కీర్తి మాట్లాడుతూ.. నేను వారి వంశాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లలేనని తెలుసు. ఆ విషయాన్ని వాళ్లకి చెప్తే ఒకటే మాట అన్నారు. నీకు పాప ఎందుకమ్మా, నువ్వే మా పాపా. మనం పాపని దత్తత తీసుకుందాం అని అన్నారు అంటూ భావోద్వేగానికి గురైంది. అనంతరం కార్తీక్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన కొన్ని ప్రమాదాల వల్ల జీవితంలో ఏది అయితే కోల్పోకూడదో దానిని ఆమె కోల్పోయింది అయినప్పటికీ నిరాశ పడాల్సిన అవసరం లేదు. నేను తనని కంటికి రెప్పలా చూసుకుంటాను అని మా ప్రేక్షకుల ముందు మా కీర్తికి ప్రామిస్ చేస్తున్నాను అని తెలిపి అనంతరం ఇద్దరూ ఒకరికొకరు రింగులు మార్చుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -