Lord Shiva: మనిషి శరీరం గురించి శివుడు పార్వతితో చెప్పిన రహస్యాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Lord Shiva: హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. సోమవారం రోజున పరమేశ్వరునికి ఇష్టమైన ఆహారాలను, పువ్వులను కాయలను నైవేద్యంగా పెట్టి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఈ సంగతి అటు ఉంచితే మనిషి చేయడం గురించి పరమేశ్వరుడు పార్వతీతో ఈ విధంగా చెప్పాడట. మరి ఆ భోళా శంకరుడు పార్వతి దేవితో ఏ విషయాలు చెప్పారు. స్వరం ఒకటి. మూడు రూపాలుగాను, ఐదు రూపములు గాను అగును. ఈ ఐదు మళ్లీ ఒక్కో రూపముగా అవుతుంది. మళ్ళీ 5 చొప్పున, 25 విధములుగా అవుతుంది అని పరమశివుడు పార్వతితో చెప్పాడు.

అలాగే శరీరాన్ని పిండమని అంటారు. ఆ పిండం నందు శరీరం ఉంటుంది. ఐదు రోజులకి బుడగలాగా ఉంటుంది. 10 రోజులకి నెత్తురు కలుగుతుంది. 15 రోజులకి మాంసం ముద్ద అవుతుంది. 20 రోజులకి గట్టి మాంసం ముద్ద అవుతుంది. 25 రోజులకి సమాన రూపం వస్తుంది. మొదటి నెల పంచభూతములు కూడును. రెండవ నెల మేధస్సు కలుగుతుంది. మూడవ నెల ఎముకలు ఏర్పడతాయి. నాలుగవ నెల అయితే అవయవాములు వస్తాయి. ఇక ఐదవ నెలలో రంధ్రములతో కూడిన చెవులు, ముక్కు, కళ్ళు, నోరు మొదలైనవి వస్తాయి. ఆరవ నెల కంఠ రంధ్రం ఏర్పడుతుంది. ఏడవ నెల పుట్టిన శిశువు బ్రతుకుతాడు. కానీ అల్పా ఆయువు, అల్ప బలము, క్షీణధాతువు వంటివి ఉంటాయి.

 

ఎనిమిదవ నెల జన్మించిన ఏ శిశువు కూడా పుట్టదు. తల్లి దేహము శిశువు దేహమునందు ప్రాణము తిరుగుతూ ఉంటుంది. 9వ నెల గర్భమునకు జ్ఞానం వస్తుంది. 9వ నెల కానీ పదవ నెల కానీ ప్రాణములతో పుడతారు. స్త్రీ రేతస్సు అధికంగా ఉండి, పురుషుని వీర్యం తక్కువగా ఉంటే ఆడ సంతానం కలుగుతుంది. అదే పురుషుని వీర్యం ఎక్కువగా ఉండి, శ్రీ రేతస్సు తక్కువ ఉంటే మగ పిల్లవాడు పుట్టును అని ఈ విషయాలని శివుడు పార్వతితో చెప్పాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -