Rashmi: రష్మీపై ఘాటు విమర్శలు చేసిన నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే!

Rashmi: జబర్దస్త్ షో లో తన హాట్ లుక్స్ తో, వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ తెగ ఫేమస్ అయింది రష్మీ గౌతమ్. ఈమె యాంకరింగ్ కన్నా ముందు చిన్నాచితగా సినిమాలలో నటించింది కానీ జబర్దస్త్ ద్వారానే మంచి ఫేమ్ సంపాదించుకుంది.

 

ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సొసైటీలో జరుగుతున్న అన్యాయాలపై ఘాటుగా స్పందిస్తూ ఉంటారు. అలాగే తన హాట్ హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ కుర్ర గారు గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటారు. అలా అని తనపై ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే అంతే ఘాటుగా రిప్లై కూడా ఇస్తుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి రష్మీ గౌతమ్ ఫేస్ చేస్తుంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా రష్మీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ప్రాణప్రతిష్ట రోజు రష్మి కాషాయ చీర ధరించి జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీనిపై ఒక నెటిజన్ కాషాయ చీర కట్టుకొని తప్పుడు పనులు చేసి దేవుని పూజిస్తే తప్పు రైట్ అయిపోతుందా అంటూ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన రష్మి ఈ విధంగా రిప్లై ఇచ్చింది. నేను నా కరెంట్ బిల్లు చెల్లించడం లేదా, లేదంటే నా కుటుంబ బాధ్యతలు మరిచిపోయి తల్లిదండ్రులను రోడ్లపై వదిలేసానా..

 

నేను నా పనులు చెల్లించలేదా, నేనేమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నానా, హత్యలు చేశానా అంతెందుకు ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా, ఆ పనులు అంటే ఏమిటి? నేను పదాలు రౌండ్ చేయడం చూస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఇలాంటి మాటలు మరీ ఎక్కువగా వింటున్నాను. నా వరకు భగవంతుడు సర్వంతర్యామి. సనాతన ధర్మంలో మంచి విషయమే అది అని ఘాటుగా సమాధానం ఇచ్చింది రష్మి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -