Rashmi: ఆ వ్యక్తిపై ఫైర్ అయిన యాంకర్ రష్మీ.. ఏమైందంటే?

Rashmi: తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన పేరు రష్మి గౌతమ్. బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రష్మి.. తక్కువ కాలంలోనే ఎంతో పాపులర్ అయింది. సినిమా ఇండస్ట్రీలో తన ట్యాలెంట్ తో అందరినీ మెప్పించాలనే ఉద్దేశంతో రష్మి రాగా.. ఆమెకు అనుకున్న విధంగా సినిమా అవకాశాలు రాలేదు. దాంతో టీవీ షో చేయడానికి అవకాశం రావడంతో.. బుల్లితెర మీద ముందు తన ట్యాలెంట్ ను చూపిద్దామని టీవీ షోలు చేసింది.

ఈటీవీలో వచ్చే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి టీవీ షోలతో యాంకర్ రష్మి బాగా ఫేమస్ అయింది. ప్రారంభంలో వచ్చీరాని తెలుగుతో ఎలాగోలా మేనేజ్ చేసిన రష్మి.. ప్రస్తుతం తెలుగులో రాటుదేలింది. ఓ పక్క టీవీ షోలు, పలు సినిమా ఫంక్షన్లు, టీవీ స్పెషల్ ప్రోగ్రాంలు చేస్తున్న రష్మి.. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు కొట్టగొడుతోంది.

వీటన్నింటికి మించిన పాపులారిటీని యాంకర్ రష్మి.. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా అవుతోంది. మూగజీవాల విషయంలో తన ఉగ్రరూపం చూపించే రష్మి.. మరోసారి మూగజీవాల మీద తన ప్రేమను, వాటిని హింసించే వారి మీద చూపించింది. కోడిపందాల గురించి ఓ వ్యక్తి పోస్ట్ పెట్టగా.. దానిపై స్పందించిన రష్మి.. ‘మూగజీవాలను హింసిచ్చి మీ పైశాచిక ఆనందం ఏంటా?’ అని ఘాటుగా స్పందించింది.

దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘ఇదే విషయం నీకు దమ్ముంటే జల్లికట్టుపై మాట్లాడు.. తమిళనాడు వాళ్లు వచ్చి చెప్పుతో కొడతారు. ఆ ధైర్యం కూడా నీకు లేదు’ అని కామెంట్ చేశాడు. అలాగే ‘నిన్ను ఇంత పెద్ద స్టార్ ను చేసిన తెలుగు ఇండస్ట్రీపై పడి ఎందుకు ఏడుస్తున్నావు ’ అని కాస్త ఘాటుగా కామెంట్ చేశాడు. దీంతో రష్మి అతడికి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చింది. ‘మీ ప్రతాపం నోరులేని మూగజీవాలపైన .. కోడి కాళ్ళకు కత్తి కట్టి కారం పెట్టి రెచ్చగొట్టడం మీ సంప్రదాయమా..? ఎవరు చేయమన్నారు అలా ..? సమాజంలో జరుగుతున్న తప్పు పనులపై ప్రశ్నించండి ..?’ అని కౌంటర్ వేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -