Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పుడే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది ఇలాంటి తరుణంలో జోగి రమేష్ కు తన సొంత బంధువులే గట్టి షాక్ ఇచ్చారు.

త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో జోగి రమేష్ సొంత బామ్మర్దిలే తనకు హ్యాండిచ్చేశారు. శుక్రవారం ఉదయం జోగి రమేష్ బామ్మర్థులు పామర్తి దుర్గాప్రసాద్ , పామర్తి దుర్గారావు, పామర్తి వెంకటేశ్వరరావు టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. జోగు రమేష్ ఇంటి ముందునే సభాస్థలి ఏర్పాటు చేసి మరీ టీడీపీలోకి 40 మంది జోగిబంధువర్గం చేరింది.

ఇలా 40 మంది వైసిపి కార్యకర్తలను టిడిపి నేత వసంత కృష్ణ ప్రసాద్ టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విధంగా పార్టీ కార్యకర్తలు కాకుండా సాక్షాత్తు జోగి రమేష్ బావమరిదులే ఇలా పార్టీ మారడంతో వైసిపి నేతలలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.

ఇలా తన భావను కాదంటూ తనకు మద్దతు తెలుపకుండా టిడిపి పార్టీకి మద్దతు తెలపడం కోసం జోగి బామ్మర్దులు టిడిపి తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ జోగి రమేష్ గెలుపు పై రోజు రోజుకు నమ్మకాలు తగ్గిపోతున్నాయి. మరి తన బావ మరదులు టిడిపి కండువా కప్పుకోవడం గురించి జోగి రమేష్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -