Naresh-Pavithra: నరేష్ పవిత్రల బంధంలో భారీ ట్విస్ట్.. అసలు వాళ్లది ప్రేమ బంధం కాదట!

Naresh-Pavithra: గత కొంతకాలం మీడియా వార్తలలో నిలుస్తున్నటువంటి నటుడు నరేష్ నటి పవిత్ర రిలేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ పలు సినిమాలలో జంటగా నటించడంతో వీరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం సహజీవనానికి కారణమైందని త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి.ఇలా ఈ జంట కలిసి గుళ్ళు గోపురాలు తిరగడంతో పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి.

నరేష్ గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సీన్లోకి ఎంట్రీ ఇచ్చి ఎలాంటి రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. అసలు నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ ను ఎలా వివాహం చేసుకుంటారని ప్రశ్నించారు.ఇలా ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరగడమే కాకుండా రమ్య రఘుపతి ఏకంగా నరేష్ పవిత్ర పై చెప్పుతో కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేసింది.

ఈ విధంగా ఈ ముగ్గురు మధ్య కొద్ది రోజులపాటు తీవ్రస్థాయిలో వివాదం చెలరేగిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా నరేష్ పవిత్ర రిలేషన్ గురించి షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఈ జంట మధ్య ఉన్నది ప్రేమ బంధం కాదని,వీరి రిలేషన్ లో భారీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నటి పవిత్ర లోకేష్ నరేష్ తో రిలేషన్ లో ఉండాలంటే తనకు నెలకు 25 లక్షల రూపాయలు చెల్లించాలని అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. అదేవిధంగా భవిష్యత్తులో నరేష్ పవిత్ర లోకేష్ ను వదిలించుకోవాలని చూస్తే తనకు భరణంగా 50 కోట్ల రూపాయలు చెల్లించాలని అగ్రిమెంట్ ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి వీరిద్దరి రిలేషన్ మధ్యన ఆ అగ్రిమెంట్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -