Belgavi: నడిరోడ్డుపై అమాయక యువకుడిని చూసి అలాంటి పని చేసిన మహిళ?

Belgavi: ఈ మధ్యకాలంలో పురుషులు మాత్రమే కాకుండా చాలామంది స్త్రీలు కూడా వివాహేతర సంబంధాల మోజులో పడి సంసారాలను నాశనం చేసుకోవడంతో పాటు జీవితాలను చేజేతులా పాడు చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాల కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. తాజాగా కూడా ఒక మహిళ అలాంటి దారుణానికే ఒడిగట్టింది. అసలేం జరిగిందంటే.. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ మహిళ పేరు జయ శ్రీ. ఈమె వయసు 40 ఏళ్లు. అయితే మద్యానికి బానిసైన ఈ మహిళ తరుచుగా మద్యం సేవించడంతోపాటు, స్థానికంగా ఉండే వ్యక్తులతో ఆమె వివాహేతర సంబంధాలు కూడా నడిపేది.

అయితే ఇటీవల ఆ మహిళ బెల్గాంలోని ఒక ప్రాంతంలో ఫుల్ గా మద్యం సేవించిన అటూ ఇటూ తిరిగుతూ ఉంది. అప్పుడు కర్ణాటక బెళగావి పరిధిలోని తారిహాల్ గ్రామంలో నాగరాజ్ రాగి పాటిల్ అనే 25 ఏళ్ళ యువకుడు అటుగా వెళ్తున్నాడు. కాగా నాగరాజ్ తల్లి చిన్నప్పుడే మరణించడంతో పాటు తండ్రి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. అయితే ఉపాధి నిమిత్తం నాగరాజ్ గతంలో మహారాష్ట్ర వెళ్లాడు. ఇటీవలే తిరిగి తన సొంతూరుకు వచ్చాడు. ఇదిలా ఉంటే తన ఊరిలో త్వరలో జాతర ఉంది. అందుకోసం కొత్త బట్టలు తెచ్చుకోవడానికి బెల్గాం వెళ్లాడు.

 

అటు నుంచి నాగరాజ్ వెళ్తుండగా జయశ్రీ అతని వద్దకి వచ్చి ఫోన్ ఇవ్వాలని కోరగా నా ఫోన్ నీకు ఎందుకు ఇవ్వాలి అని అన్నాడు. దాంతో వెంటనే జయశ్రీ నాగరాజ్ తో గొడవ పెట్టుకుంది. ఇక తాగిన మైకంలో ఆ మహిళ అందరూ చూస్తుండగానే తన వద్ద ఉన్న కత్తితో నాగరాజ్ ను అతి దారుణంగా పొడిచింది. ఈ దాడిలో ఆ యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోవడంతో నాగరాజ్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం స్థానికులు ఆ మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -