Actress Sadha: పెళ్లి గురించి ఫుల్ క్లారిటీతో ఉన్న నటి… కాబోయే భర్త అలా ఉండాలంటూ కామెంట్స్?

Actress Sadha: జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి సదా.వెళ్ళవయ్య వెళ్ళు అనే ఒక డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయిన ఈమె తాను నటించిన మొదటి సినిమా కూడా మంచి విజయం సాధించడంతో తెలుగు తమిళ భాషలలో వరుస అవకాశాలు వచ్చాయి. ఇలా తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈమె ప్రస్తుతం వెండితెరకు దూరమయ్యారు. ఇక సదా గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే గతంలో ఈమె తెలుగుతో పాటు తమిళంలో పలువురు అగ్ర హీరోల సరసన నటించారు. ముఖ్యంగా నటుడు మాధవన్ తో కలిసి బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలలో నటించిన ఈమె ఆయనతో కలిసి ప్రియ సఖి అనే సినిమాలో చాలా రొమాంటిక్ గా నటించారని చెప్పాలి. ఇక ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ చూసి చాలా మంది వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఇలా తాను నటుడు మాధవన్ ను పెళ్లి చేసుకోబోతున్నానని వస్తున్న వార్తలు విని ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఈ వార్తలు నన్ను ఎంతగానో బాధపెట్టాయి.అయితే సినీ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణమని ప్రస్తుతం వీటి గురించి పట్టించుకోవడం కూడా మానేశానని ఈ సందర్భంగా ఆ వార్తలను కొట్టి పారేశారు.ఇకపోతే తన పెళ్లి గురించి కూడా ఎన్నో ప్రశ్నలు ఎదురవడంతో ఈమె ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదని పెళ్లి చేసుకునే సమయంలో తప్పకుండా అందరికీ చెబుతానని వెల్లడించారు. ఇకపోతే తాను చేసుకోబోయే వ్యక్తి పూర్తిగా శాకాహారి అయి ఉండాలని, తన ఎలాంటి పబ్బులకు క్లబ్బులకు వెళ్లకుండా ఇతరులపై ఆధారపడకుండా ఉండే వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా సదా తన పెళ్లి గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈమె నటించిన హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ జీ 5 యాప్ లో ప్రసారమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -