Tollywood: స్టార్ హీరో నిజస్వరూపం చెప్పిన సదా.. ఏమైందంటే..?

Tollywood: ‘జయం’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సదా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తొలి చిత్రంతోనే తన అందం అభినయంతో అందరినీ ఆకర్షించిన ఈ బ్యూటీ.. వరుస అవకాశాలు అందుకుంది. అయితే అమ్మడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఎన్టీఆర్ – బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించినా తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది.

 

టాలీవుడ్‌లో సదా పరిస్థితి ఎలా ఉన్నా తమిళ్ లో మాత్రం ‘అన్నియన్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆమె ఖాతాలో ఉంది. షోమ్యాన్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా, తెలుగులో ‘అపరిచితుడు’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా వద్ద ఘన విజయం సాధించింది. ఇది సదాకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సదా.. ఈ సినిమా గురించి హీరో విక్రమ్ – డైరెక్టర్ శంకర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

 

‘అపరిచితుడు’ సినిమా షూటింగ్ ఎంతో సరదాగా సాగిపోయేదని.. తనకు విక్రమ్ మధ్య సన్నివేశాలు చాలా ఆసక్తిగా జరిగేవని సదా తెలిపింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ బాగా వచ్చేవని చెప్పింది. అయితే సీన్ చేసిన తర్వాత విక్రమ్ తనని ‘చెల్లి’ అని పిలిచేవాడని.. తాను కూడా విక్రమ్‌ను ‘అన్నా’ అనే పిలిచేదానిని అంటూ సదా వెల్లడించింది. సీన్ అయ్యాక చెల్లి అనగానే సెట్‌లో అందరూ నవ్వేవాళ్లని చెప్పింది. అయితే ఈ విషయం శంకర్ గారికి తెలిసి సీరియస్ అయ్యారని.. ‘మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు ఇలా అన్నా చెల్లి అని పిలుచుకుంటున్న విషయం బయట తెలిస్తే ఎలా ఉంటుంది?. మిమ్మల్ని సినిమాలో స్క్రీన్ మీద చూస్తే, అన్నా చెల్లి అనే భావన వారికి కలిగితే ఇబ్బందిగా ఉంటుంది. ఇలా చేస్తే సినిమాకే నష్టం కలుగుతుంది. మొత్తానికి సినిమానే నాశనం అవుతుంది. మీరు అలా చేయకండి’ అని శంకర్ చెప్పారంటూ సదా చెప్పుకొచ్చింది.

 

సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న సదా
సదా ప్రస్తుతం పలు బుల్లితెర షోలలో జడ్జిగా వ్యవహరించడమే కాదు.. ‘హలో వరల్డ్’ వంటి వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తోన్న ఈ భామ.. చాలా గ్యాప్ తర్వాత ‘అహింస’ అనే తెలుగు సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. తనని ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ద్వారా దగ్గుబాటి అభిరామ్ హీరోగా లాంచ్ అవుతున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీ సదాకి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -