Adipurush: ఆదిపురుష్ మూవీ మైండ్ బ్లోయింగ్ రివ్యూ.. నెక్స్ట్ లెవెల్ అనేలా?

Adipurush: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్ కలిసి నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 16 న విడుదల కానుంది. టీ సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్, ట్రైలర్, పోస్టర్, పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. కాగా ప్రస్తుతం చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

కాగా తాజాగా ఆదిపురుష్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తాజాగా కొద్దిసేపటి కిందనే చిత్ర యూనిట్ ప్రకటించింది. బోర్డు నుంచి U సర్టిఫికెట్ పొందినట్టు వెల్లడించారు. అదే విధంగా మూవీ రన్ టైమ్ ను కూడా రివీల్ చేశారు. సినిమా మొత్తం రెండు గంటల 59 నిమిషాలు నిడివిని కలిగి ఉంది. రన్ టైమ్ కూడా లెన్తీగానే ఉండటంతో అభిమానులకు విజువల్ ట్రీట్ అందించనుంది. వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్ తర్వాత ఆదిపురుష్ సినిమా నుంచి అప్పట్లో వచ్చిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. అలాగే మొన్నతిరుపతిలో నిర్వహించిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ రెండో ట్రైలర్ ను విడుదల చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

కాగా ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా ఆదిపురుష్ వైబ్సే కనిపిస్తున్నాయి. కలెక్షన్ల పరంగా కూడా సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల ప్రకారం ఈ మూవీ సరికొత్త రికార్డులు సృష్టించబోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ప్రస్తుతం నెట్టింట్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, అలాగే అభిమానుల నుంచీ వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం కాయం అని తెలుస్తోంది. మరి ఈ సినిమా థియేటర్లో విడుదల ఏ మేరకు రకం మెప్పిస్తుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -