Rajanna Sircilla: రౌడీ షీటర్ తో ఎఫైర్.. ఓ రాత్రి మహిళతో కలిసి?

Rajanna Sircilla: ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల మోజులో పడి చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు. వివాహేతర సంబంధాలకు చాలా ప్రాణాలు బలవుతున్నాయి. భార్య భర్తను చంపితే భర్త భార్యను చంపుతున్నారు. తరచూ అలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజవర్గం పరిధిలోని తంగళ్ల పల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన వాసు ఒక హత్యకేసులో నిందితుడు. దాంతో అతనిపై తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ తెరిచారు.

కాగా వాసుకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఒర్సు గౌరవ్వ అనే మహిళతో వాసు గత 5 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడు. కాగా వాసు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం మాత్రమే కాకుండా ఆమె ఇద్దరు కూతుళ్లను వాసు తరచూ వేధింపులకు గురి చేస్తుండేవాడు. తాజాగా మరోసారి మద్యం తాగి ఇంటికి వచ్చిన వాసు తలపై గౌరవ్వ సుత్తితో బలంగా కొట్టగా వాసు అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనను ప్రమాదంగా చిత్రీ కరించడానికి ఆమె అల్లుడైన పల్లెపు దినేష్ అనే వ్యక్తి సహకారంతో ద్విచక్రవాహనం పై వాసు మృతదేహాన్ని సారంపల్లి శివారులో ఉన్న కొమురయ్య కుంట వద్దకు తీసుకెళ్లి పడేసింది.

 

తరువాత కొద్దీ దూరంలో ద్విచక్ర వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి గౌరవ్వ,దినేష్ ఇద్దరు పారిపోయారు. ఈ సంఘటనపై వాసు భార్య కొమిరె నిర్మల ఫిర్యాదుతో నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా వాసు పై నేరచరిత్ర ఉంది అని పోలీసులు సైతం వెల్లడించారు. వాసు పై పోలీసులు 2021లో రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారట. తరచూ ఇతరులతో వివాదాలు పెట్టుకోవడం మాత్రమే కాకుండా 10 సంవత్సరాల క్రితం ఓ హత్య కేసు కూడా నమోదు అయిందట.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -