ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితాంతం కలిసి మెలిసి ఉండేవారు. ఒక్కసారి ఇంటిని విడిచి వచ్చి ప్రేమించిన వారితో జీవితాన్ని మొదలు పెడితే ఊపరి ఉన్నంత వరకూ వారితోనే ఉంటూ కష్ట సుఖల్లో పాలు పంచుకునేవారు. కానీ.. ప్రస్తుతం ప్రేమ, పెళ్లి అనేవి కొన్ని రోజులకే మాత్రమే పరిమితమవుతున్నాయి. ఆడ,మగ అనే తేడా లేకుండా ఒకరిని ఒకరు మోసం చేస్తూ వారి కుటుంబాలను రోడ్డుకెక్కిస్తున్నారు.
తాజాగా ఓ యువకుడు ఓ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని రెండు నెలలకే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంట్లో చెప్పపెట్టాకుండా పరార్ అయ్యాడు. కర్ణాటక రాష్ట్రం నేలమంగలలోని త్యామగూండ్లుకి చెందిన ప్రదీప్, పూర్ణిమా రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ విషయమై ఇద్దరు కుటుంబ సభ్యులకు తెలుపగా వారు కూడా ఒప్పుకోవడంతో జూన్ 1న ఓ దేవాస్థానంలో ఘనంగా పెళ్లి జరిపారు. పెళ్లి సమయంలో కొంత బంగారం, నగదు కూడా ప్రదీప్కు ఇచ్చారు. పెళైన రెండు నెలలు వీరి కాపురం సజావుగా సాగింది.
భర్త ఇంటి ముందు ధర్నా..
రెండు నెలల తర్వాత ప్రదీప్ కనిపించకుండా పోయాడు. భయాందోళనకు గురైన పూర్ణిమ తన భర్తను ప్రదీప్ కుటుంబ సభ్యులే దాచిపెట్టారంటూ అత్తరింటి ముందు ధర్నాకు దిగింది. అనంతరం పోలీసుల సహాయంతో భర్త ప్రదీప్ కోసం తెలిసినా ప్రాంతాలన్నీ వెతికింది. అయినా ప్రదీప్ జాడ తెలియరాలేదు. కొన్ని రోజుల తర్వాత ప్రదీప్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని పరారైనట్లు తెల్వడంతో పూర్ణిమ కుటుంబంతో కలిసి ప్రదీప్పై పోలీసుకు ఫిర్యాదు చేసింది.