Pradeep: ప్రదీప్ ను నమ్మిన వాళ్లే నిలువునా ముంచేశారా.. అలాంటి కష్టాలు అనుభవిస్తున్నారా?

Pradeep: ఎఫ్2 సినిమాలో అంతేగా.. అంతేగా అంటూ భార్య చాటు భర్తగా నటించిన నటుడు గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ పాత తరం వారికి నటుడు ప్రదీప్ పరిచయమే. రెండు జెళ్ళ సీత, నాలుగు స్తంభాలాట వంటి సినిమాలలో హీరోగా నటించిన నటుడు ప్రదీప్. ఆ తర్వాత దూరదర్శన్ ప్రారంభమైన కొత్తల్లో తొలితరం యాంకర్ గా ప్రదీప్ ని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లోనే ఆయన న్యూస్ రీడర్ గా, యాంకర్ గా, టీవీ యాక్టర్ గా ఎంతో ఉన్నత స్థాయిని చూసిన వ్యక్తి యాక్టర్ ప్రదీప్.

నేడు యాంకర్ లోనే సెన్సేషన్ సృష్టిస్తున్న సుమని మొట్టమొదట బుల్లితెరకి పరిచయం చేసింది ప్రదీపే. ఇంతకీ ఇప్పుడు ఈయన గురించి ఎందుకు అనుకుంటున్నారా.. ఈయన ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించిన ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో సంపాదించిన డబ్బులను మొత్తం పోగొట్టుకొని ఎన్నో కష్టాలు అనుభవించాను.

 

సొంత ఇంటిని కూడా అమ్మి అద్దె ఇంట్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. మంచివారు అని గుడ్డిగా నమ్మి కొందరితో వ్యాపారాలు చేయడం వల్ల అతను ఈరోజు ఈ పరిస్థితి వచ్చానని.. కేవలం తన ఆ జాగ్రత్త కారణంగానే కోట్ల రూపాయల డబ్బుని పోగొట్టుకున్నానని, అయితే అయిన వాళ్లే కదా అనుకున్నాను కానీ ఇంత మోసం చేస్తారు అనుకోలేదు. జీవితానికి సరిపడ గుణపాఠం నేర్చుకున్నాను. తర్వాత నుంచి ఎవరిని గుడ్డిగా నమ్మడం మానేశానని చెప్పుకొచ్చారు ప్రదీప్.

 

ఆ తరువాత సీరియల్స్ లోను, సినిమాలలోని మంచి అవకాశాలు రావడంతో తిరిగి జీవితంలో మళ్లీ పైకి ఎదిగానని. ఇప్పుడు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా సెక్యూర్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు ప్రదీప్. అయితే ఈయనే కాదు ఈయన భార్య సరస్వతి కూడా దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా పనిచేస్తూ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన యాంకరే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -