Alekhya Reddy: వీలునామా రాసేసిన అలేఖ్య రెడ్డి.. పిల్లలకు అంత రాసేసిందా?

Alekhya Reddy: నందమూరి తారకరత్న మరణంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భాంత్రికి గురైంది. ఆయన మరణం కటుంబ సభ్యులకు తీవ్ర వేదనను మిగిల్చింది. భర్త దూరం కావడంతో తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి విషాదంలో కూరుకుపోయారు. ఇప్పటికే తారకరత్న మృతి చెందిన ఘటన నుంచి బయట పడటం లేదు. అయితే పరిస్థితులు ఎలా వస్తాయో తెలిదు కనుక, పిల్లలపైన భారీగా ఆస్తులు అలేఖ్యా రెడ్డి రాసినట్లు వార్తలు వస్తున్నాయి. వారి భవిష్యత్తుకు అవి ఎంతో ఉపయుక్తం అవుతాయని అంటున్నారు.

తారకరత్న మృతితో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఇంటి పెద్దగా ఉన్న తారకరత్న లేకపోవటం అలేఖ్యా రెడ్డి ఫ్యామిలీకి తీరని లోటే. దాన్ని ఎవరూ పూడ్చలేరు. ఆర్థికంగా ఆదుకునే వారు, మానిసికంగా కలిసి దగ్గరగా ఉంటేవారు చాలా తక్కువ. పైగా అలేఖ్య రెడ్డి-తారకరత్నది ప్రేమ వివాహం. పెద్దలను వ్యతిరేకించి మరీ ఈ పెళ్లి చేసుకున్నారు. నందమూరి ఫ్యామిలీ ఈ పెళ్లికి ఏ మాత్రం ఒప్పుకోలేదు. ఆ తర్వాత బాలకృష్ణనే పరిస్థితులను చక్కదిద్దారని తెలిసింది.

 

సినిమాల్లో కొంతకాలం రాణించిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తారకరత్న. ఆ ప్రయాణంలోనే ఆయన కన్నుమూశారు. తారకరత్నకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు ఉన్నారు. ఇప్పుడు వీరి గురించే అలేఖ్యా రెడ్డికి దిగులు అంతా. తారకరత్న వెళ్లిపోయాడు. తాను లేకపోతే పిల్లల పరిస్థితి ఏమిటని కుమిలిపోతోందట. అందుకే వారికి ఆర్థికంగా భరోసా ఉండటానికి పెద్ద ప్లాన్ వేసిందట అలేఖ్య రెడ్డి. ఏకంగా ముగ్గరి పేర్ల పైన మూడు వందల కోట్ల రూపాయల ఆస్తులని రాసిందని టాక్. వారి చదువులు, పెళ్లి ఖర్చుల నిమిత్తం ఇవి ఉండాలని నిర్ణయిందట అలేఖ్యా రెడ్డి. దీనిపై తారకరత్న అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -