Alekhya Reddy: భర్తను గుర్తు చేసుకుని కుమిలిపోతున్న అలేఖ్యరెడ్డి.. పిల్లల గురించి అలా చెబుతూ?

Alekhya Reddy: టాలీవుడ్ దివంగత హీరో నందమూరి తారకరత్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి తారకరత్న ఈ ఏడాది ఫిబ్రవరి 22న గుండెపోటు తో మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణాన్ని అభిమానులు ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఇంకా మనకు కళ్ళ ముందు మొదలుతూనే ఉన్నాయి. తారకరత్న మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. నారా లోకేష్ యువగలం పేరుతో చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కుప్పకూలిపోయారు.

ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో గుండెనొప్పి వచ్చింది. ఆ తర్వాత బెంగళూరులోని హృదయాలయ హాస్పిటల్ చికిత్స తీసుకుంటూ దాదాపు కొన్ని రోజులపాటు మృత్యువుతో పోరాడి ఆయన తుది శ్వాస విడిచారు. ఆ సమయంలో ఆయన భార్య పిల్లలు విలపించిన దృశ్యాలు ఇప్పటికీ మన కళ్ళముందే మెదులాడుతూ ఉంటాయి. కాగా నేడు తారకరత్న కొడుకు కూతురు పుట్టిన రోజు. తారకరత్నకు కవల పిల్లలు అన్న విషయం తెలిసిందే. వారి పేర్లు తన్యారామ్, రేయ. ఈరోజు వాళ్ళ పుట్టినరోజు. దీంతో అలేఖ్య రెడ్డి తారకరత్న ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. తారకరత్నతో వాళ్లకున్న అనుబంధాన్ని ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ గా స్పందించింది.

 

ఈ సంతోషకర సమయంలో ఎంత ప్రయత్నించినా నవ్వడం నా వల్ల కావడం లేదు.. మన బిడ్డలకి ఆనందంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నాను .. నువ్వు నా పక్కనే ఉండి ఉంటే చాలా ఆనందంగా ఉండేది. కానీ పిల్లల సంతోషం రూపంలో నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు అనుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ని చేసింది అలేఖ్య రెడ్డి. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -