Mahesh: మహేష్ జక్కన్న మూవీపై అదిరిపోయే అప్ డేట్.. ఏం జరిగిందంటే?

Mahesh: ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ గెలిచిన నేపథ్యంలో మహేష్ తో సినిమాని ప్రకటించాడు దర్శక దిగ్గజం జక్కన్న. ఎస్ ఎస్ ఎం బి 29 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. పాన్ వరల్డ్ గా జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది.

గుంటూరు కారం రావడం వెళ్ళిపోవటం అన్ని జరిగిపోయాయి. ఇక మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పైన అందరి దృష్టి పడింది. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో రాజమౌళి తండ్రి కధా రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ మూవీపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇచ్చారు. మహేష్ బాబు కెరియర్ లో ఇది 29వ సినిమా కానుంది. అతనితో సినిమా చేయనున్నట్లు 2022 సెప్టెంబర్ లో రాజమౌళి అధికారికంగా అనౌన్స్ చేశాడు.

 

మొత్తానికి ఏడాదిన్నర తర్వాత ఈ సినిమా కథ పూర్తి అయినట్లు వెల్లడించాడు విజయేంద్రప్రసాద్. ప్రస్తుతం మహేష్ బాబుతో కథ అయిపోయింది రాజమౌళితో చేస్తున్నాము. ఇక స్క్రిప్ట్ లాక్ అయింది కాబట్టి నెక్స్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయడమే లేట్. స్టార్ కాస్టింగ్ ఫైనల్ అయిపోయి మహేష్ బాబు వర్క్ కంప్లీట్ చేస్తే ఆ తర్వాత వెంటనే షూటింగ్ మొదలుపెట్టనున్నారు అని చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్.

 

అయితే రాజమౌళి టొరెంట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియానా జోన్స్ స్టోరీ లైన్ తో మూవీ రానున్నట్లు తెలిపారు భారత మూలాలతో ఉండబోయే జేమ్స్ బాండ్ లేదా ఇండియానా జోన్స్ లాంటి మూవీ అని చెప్పాడు. తేదీ ఏమైనా విజయేంద్ర ప్రసాద్ మాత్రం మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు మరి ఈ కాంబో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో వేచి చూడాల్సిందే.

 

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -