Anasuya: ఇబ్బందులు పడుతుంటే అప్పుడు ఎందుకు తిరిగొచ్చావ్ అనసూయ?

Anasuya: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనసూయ ఒకరు.ఈ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని దూసుకుపోతుంది. ఇలా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది గుర్తింపు పొంది ప్రస్తుతం ఈ కార్యక్రమంలో నుంచి బయటకు వెళ్లి ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకొని చివరికి ఈ కార్యక్రమాన్ని వదిలిన వెళ్లిన వారిలో అనసూయ ఒకరు.

అనసూయ ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం తనకు ఎంతో మంచి పేరు సంపాదించిందని అయితే కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నానని అనసూయ ఈ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక తాను ఒక బ్రాహ్మిన్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయని తనకు అవకాశాలు పేరు పరపతి కన్నా ఆత్మగౌరవమే ముఖ్యం అంటూ అనసూయ షాకింగ్ కామెంట్స్ చేశారు.

అయితే కొంతకాలం నుంచి జబర్దస్త్ కార్యక్రమం వల్ల తాను ఇబ్బందులు పడుతున్నానని అందుకే ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నట్లు ఈమె వెల్లడించారు. ఇకపోతే ఈ విషయం పలువురు నెటిజెన్లు స్పందిస్తూ..అనసూయ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది అయితే తనకిప్పుడు అవకాశాలు రావడంతోనే బయటకు వెళ్లిందని ఇలా బయటకు వెళ్లిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమం పై బురద చల్లే ప్రయత్నం చేస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

గతంలో అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తూ కొంత కాలం పాటు ఈ కార్యక్రమానికి విరామం ఇచ్చారు. ఆ సమయంలో రశ్మి ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు.అనసూయకు ఈ కార్యక్రమంలో ఇబ్బందులు కనుక ఉంటే మళ్ళీ ఈ కార్యక్రమానికి ఎందుకు తిరిగి వచ్చినట్టు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయనీ, ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనే వాదన కూడా వినపడుతుంది.

ప్రస్తుతం అనసూయకు ఎన్నో అవకాశాలు ఉండటం వల్లే తాను జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు లేకపోతే అనసూయ పరిస్థితి ఏంటి? అవకాశాలు లేకపోతే ఈమె అన్నట్టుగానే ఇంటికి పరిమితం అయ్యి అంట్లు తోముకుంటారా? లేకపోతే మరోసారి మల్లెమాల వారిని అవకాశాల కోసం ఆశ్రయిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -