Jabardasth Rohini: బుల్లితెర సీరియల్స్ లో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రోహిణి అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పాల్గొని సందడి చేశారు. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రోహిణి బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా సందడి చేశారు.ఈ కార్యక్రమం అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ఈమె ఇండస్ట్రీకి దూరమైన విషయం మనకు తెలిసిందే. తన కాలికి సర్జరీ కావడంతోనే కొద్దిరోజులపాటు ఇంటికే పరిమితమై రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ఈమె చేతి కర్ర సహాయంతో నడుస్తున్నారు. అయినప్పటికీ బుల్లితెరపై పలు కార్యక్రమాలలో సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
తాజాగా ఓ బుల్లి తెర కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా రోహిణి ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు. యాంకర్ రవితో కలిసి రోహిణి వీల్ చైర్ పై కూర్చుని ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు రోహిణి వ్యవహారంపై ప్రశంసలుకురిపించగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు.
అయితే ఆమె ఈ కార్యక్రమానికి మూడు నెలల క్రితమే కమిట్ కావడంతో తప్పనిసరి పరిస్థితులలో తానే యాంకరింగ్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే రోహిణి పట్టుదల చూసి అందరూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. మరికొందరు మాత్రం ఆరోగ్యం కూడా ముఖ్యం కదా నిలవలేని స్థితిలో ఉన్నటువంటి నీవు యాంకరింగ్ చేయడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.