Jabardasth: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ యాంకర్ సౌమ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూ అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది సౌమ్య. హైపర్ ఆదికి రివర్స్ లో పంచులు వేస్తూ మరింత పాపులర్ అయింది. దీంతో ఆమె జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో హైపర్ ఆదికి మొగుడు వచ్చాడు అంటూ కూడా జోరుగా వార్తలు వినిపించాయి. కాగా ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా ఎంట్రీ ఇవ్వకముందే తెలుగులో పలు సీరియల్స్ లో కూడా నటించింది.
ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే ఇటీవలె శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన డాన్సులతో కామెడీతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇటీవలే మదర్స్ డే సందర్భంగా తన మదర్ కి సంబంధించిన కొన్ని విషయాలను బయట పెట్టింది సౌమ్య. తన తల్లి అనుభవించిన బాధను ఏ అమ్మ పడకూడదు అంటూ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసింది సౌమ్య రావు. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సౌమ్య రావు అమ్మగారికి క్యాన్సర్. సుదీర్ఘంగా కొన్ని ఏళ్లపాటు క్యాన్సర్ తో పోరాడి ఆమె తనువు చాలించిందట.
అయితే ఆమెను బ్రతికించుకోవడానికి సౌమ్య చాలా కష్టాలు పడిందట. డబ్బులు ఎంతో ఖర్చు చేసిందట. ఎంతోమంది దేవుళ్లను ప్రార్థించిందట. అయినా సరే ఆ దేవుడు ఎవరు కరుణించలేకపోయారు అంటూ తల్లిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ క్రమంలోనే తన తల్లితో గడిపిన వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు.