Kirrak RP: ఆర్పీ పరువు తీసిన మలక్ పేట శైలజ.. ఏమన్నారంటే?

Kirrak RP: ప్రముఖ టాలీవుడ్ నటి మలక్ పేట శైలజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శైలజ జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగాఆమె మాట్లాడుతూ.. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నేను ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నందుకు నాకు వాళ్ళు రూ. 17,500 ఇచ్చారు. నేను డబ్బుల కంటే మాటలకు ప్రాధాన్యత ఇస్తాను.

మనం మాట మీద ఉండటం ఒక ఎత్తు అని చెప్పుకొచ్చింది శైలజ. నేను హైపర్ ఆది వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వెళ్ళాను. మల్లెమాలకు రుణపడి ఉంటాను అని శైలజ తెలిపింది. నేను ఏంటి అన్నది ఈటీవీ కి బాగా తెలుసు. మల్లెమాల కీర్తి బంగారు కొండ అని శైలజ చెప్పుకొచ్చింది. నేను నచ్చాను కాబట్టే మంచి ఆఫర్లు వచ్చాయి. స్క్రిప్ట్ లేకుండానే శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్ జరుగుతుంది. మల్లెమాల కంపెనీకి నిజంగా జోహార్లు అని శైలజ తెలిపారు. మల్లెమాల వాళ్లు అద్భుతమైన భోజనం పెడతారని శైలజ పేర్కొన్నారు. మూడు నాలుగు రకాల టిఫిన్లు పెడతారని మంచి భోజనం కూడా పెడతారని ఆమె వెల్లడించింది.

కానీ కొందరు మాత్రం తిన్నింటి వాసాలు లెక్కపొట్టొద్దు అంటూ ఇండైరెక్టుగా కమెడియన్ ఆర్పీపై శైలజ పరోక్షంగా కామెంట్లు చేశారు. జబర్దస్త్ లేకపోతే మీ మొహాలకు సినిమాలు వచ్చేవా అంటూ శైలజ ప్రశ్నించారు. మల్లెమాల సంస్థలో అన్నం బాలేదని అనేవాళ్లకు అన్నం పుట్టదని ఆమె పడ్డారు. ఇంటర్వ్యూలో భాగంగా శైలజ చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా జబర్దస్త్ షో ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవడంతో పాటు వెండితెరపై అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -