Anupama Parameswaran: అనుపమ అందాల ఆరబోత.. హాట్ హాట్‌గా!

Anupama Parameswaran: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల ఒకరిగా కొనసాగుతున్నారు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. కుర్రకారు చూపు తిప్పుకోనివ్వకుండా చేయగల అందం.. మత్తెక్కించే కన్నులతో విశేషమైన గుర్తింపును దక్కించుకుంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్, క్రేజ్‌తో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తోంది. సినిమాల్లో బిజీగా ఉంటునే.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటారు. తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారును నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

 

‘ప్రేమమ్’ అనే మలయాళ సినిమాతోనే తెరంగేట్రం చేసింది అనుపమ. టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అ.. ఆ..’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందాయి. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ సినిమాలో అలరించింది. ఆ తర్వాత ‘ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే, కృష్ణార్జున యుద్ధం’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈ మూడు సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘రాక్షసుడు’ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి హిట్ కొట్టింది.

 

ఆ తర్వాత ‘రౌడీ బాయ్స్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా థియేటర్ల వద్ద బోల్తా కొట్టినా.. అనుపమకు మాత్రం క్రేజ్ పెంచింది. ఈ సినిమాలో ఘాటు ముద్దు సీన్లలో రెచ్చిపోయింది. అయితే అప్పటివరకు ఏ సినిమాల్లోనూ బోల్డ్ సీన్లు చేయని అనుపమ.. రౌడీ బాయ్స్ సినిమాలో గ్లామర్ షో చేసింది. హాట్, రొమాంటిక్ సీన్స్ లో నటించి రెచ్చిపోయింది. ఇటీవల విడుదలైన ‘కార్తీకేయ-2’ సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా మరోసారి అనుపమ తన అందాలను ఆరబోసింది. ఎల్లో కలర్ టాప్ ధరించిన అనుపమ.. బోల్డ్ షో ప్రదర్శించింది. స్మైలింగ్ ఫోటోతో యువతను ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -