Sonu Sood: ఆ హీరోయిన్ విషయంలో సోనూసూద్ కి జాగ్రత్తలు చెబుతున్న ఫ్యాన్స్?

Sonu Sood: సోనూసూద్‌.. ఈ పేరు గురించి పరిచయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా సోనూసూద్‌ కి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది అభిమానులు సోనూసూద్‌ దేవుడిగా భావించి పూజలు కూడా చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. రీల్ లైఫ్ లో విలన్ పాత్రలు పోషించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నారు. అయినా మంచితనం గురించి చెప్పాలి అంతే కరోనా మహమ్మారి సమయంలో వందలాది మందిని తన సొంత ఖర్చులతో స్వస్థలాలకు చేర్చారు సోనూసూద్‌.

కరోనా మహమ్మారి సమయంలో మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తూ సహాయం అనే కోరిన వారికి లేదనకుండా సహాయాలు చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ మరొకవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు సోనూసూద్. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోనూసూద్‌ ఎంటీవీ రోడీస్‌ సీజన్‌ 19 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కాగా ఇదే ప్రాజెక్టులో బాలీవుడ్‌ హీరోయిన్‌, దివంగత హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కూడా ఉంది.

 

ప్రస్తుతం ఈ టీవీ షో షూటింగ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లో జరుగుతోంది. ఈక్రమంలో సెట్‌లో ఉన్న వారందరి కోసం సరదాగా దోసెలు వేశారు సోనూసూద్‌. ఎవరికి ఎలాంటి దోసెలు కావాలో అడిగి మరీ రెడీ చేశారు సోనూసూద్. ఇదే సమయంలో హీరోయిన్‌ రియా అక్కడకు వచ్చింది. దీంతో ఆమె కోసం కూడా బ్రేక్‌ఫాస్ట్‌ రెడీ చేసి ఇచ్చారు సోనూసూద్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో సోనూ సూద్‌ సింప్లిసిటీని చూసి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. వీడియో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆ వీడియోని చూసినా సుశాంత్ సింగ్ రాజపుత్ అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తూ సోనుసూద్ కి జాగ్రత్తలు చెబుతున్నారు. సుశాంత్ రాజపుత్ సూసైడ్ కేసులో బాగా రియా ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు కొంతకాలం జైల్లో కూడా ఉండి వచ్చిన విషయం తెలిసిందే. ఆమెతో కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ సోనూసూద్‌ కి జాగ్రత్తలు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -