Sr NTR: దివంగత నటుడు నేత నందమూరి తారక రామారావు మరణించి ఏ లోకాన ఉన్నారో తెలియదు కానీ ఆయన మరణించిన ఆయన పేరును తమ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బ్రతికున్నప్పుడు తనని ఈయననీ చిత్రహింసలకు గురి చేశారు. ఆయనని నాలుగు గోడల మధ్య ఎలాంటి బాధలకు గురి చేశారు అనే విషయాలు బయటకు చెప్పకపోయినా బయట మాత్రం ఎన్టీఆర్ గురించి ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.
ఇక ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు వర్ధంతి వేడుకలు అంటూ ఓ రేంజ్ లో ఎన్టీఆర్ పై ప్రేమను చూపే చంద్రబాబు నాయుడు తనకు వెన్నుపోటు పొడిచిన విషయాలను కూడా ఇలా బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రసంగిస్తే బాగుంటుందని పలువురు నేతలు కోరుకుంటున్నారు.ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం కోసం లక్ష్మీపార్వతిని ఎలా పావుగా వాడుకున్నారో ప్రజలకు తెలియాలని భావిస్తున్నారు.
ఎన్టీఆర్ పై చొప్పలు విసిరేలా చేయడం తనని అసెంబ్లీలో మాట్లాడకుండా ఉండేలా చేయడం..ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించడం, పార్టీ గుర్తును లాక్కోవడం తదితర అంశాలపై ప్రముఖులతో ప్రసంగాలు ఇప్పిస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. తనకు చంద్రబాబు వెన్నుపోటు పొడవడంపై ఎన్టీఆర్ చేసిన చారిత్రక ప్రసంగాన్ని పుస్తకంగా తీసుకొచ్చి, వెన్నుపోటు దినం నాడు ఆవిష్కరిస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.
ఎన్టీఆర్ ను మానసికంగా చంద్రబాబు నాయుడు ఇలాంటి చిత్రహింసలకు గురి చేశారనీ కొందరి నేతలకు బాగా తెలుసు కానీ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గురించి చెప్పినదే చరిత్ర అవుతుంది అలా కాకుండా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను పెట్టిన ఇబ్బందులు తెలిసినటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు ముందుకు వచ్చి చంద్రబాబు కుట్ర రాజకీయాలను బయటపెట్టినప్పుడే ఎన్టీఆర్ గారికి ఆత్మశాంతి కలుగుతుందని పలువురు భావిస్తున్నారు.