Venu: వైరల్ అవుతున్న బలగం వేణు షాకింగ్ కామెంట్స్!

Venu: తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ వేణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న వేణు,తరువాత కాలంలో వెండితెర పై కూడా రాణించిన సంగతి తెలిసిందే. ఇటీవల బుల్లితెరపై సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా ప్రారంభించాడు. ఇది ఇలా ఉంటే వేణు తాజాగా దర్శకత్వం వహించిన సినిమా బలగం. ఈ సినిమాతో వేణు దర్శకుడుగా కూడా మారారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తెలిపారు.

బలగం సినిమాతో కమెడియన్ కాస్త డైరెక్టర్ వేణుగా మారిపోయాడు. ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇదివరకు వేణు ని తిట్టిన వారే ఇప్పుడు వేణుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు వేణు. ఈ సినిమా సక్సెస్ అయినా సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. కమెడియన్ వీడు సినిమా డైరెక్టర్ ఏంటి అని చాలామంది నవ్వుకున్నారు.

ఇప్పుడే కాదు రుద్రమదేవి,జై లవకుశ సినిమాలలో సన్నివేశాలను రాసినప్పుడు కూడా ఎవరు నన్ను నమ్మలేదు. రాశాను అని నమ్మిన వాళ్లు వేరే వాళ్ళకి చెప్పిన కూడా వాళ్ళు నమ్మలేదు. కమెడియన్ వేణు కాదులే మరెవరో అయి ఉంటారు అని కొట్టి పరేశారు. అలాంటిది ఈ సినిమా తరువాత నన్ను అందరు పొగుడు తుంటే చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు వేణు. అలా నన్ను చూసి నవ్వినోళ్ల నోరు మూయించాను అని తెలిపారు వేణు. ఇంటర్వ్యూలో భాగంగా వేలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -