Balagam: బలగం మూవీ గ్రేట్.. విడిపోయిన అక్కాతమ్ముళ్లను కలపడంతో?

Balagam: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడుగా మారి ఆయన దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన చిత్రం బలగం. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు అందుకున్నటువంటి వేణు పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది విడిపోయిన కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకున్నటువంటి సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాము.

ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా వనపర్తి మండల పరిధిలో బలగం సినిమాని ప్రదర్శించారు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత 15 సంవత్సరాల క్రితం విడిపోయిన అక్క తమ్ముడు కలుసుకున్నటువంటి ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే.. అనుముల లింగారెడ్డి, లక్ష్మి అక్కా తమ్ముళ్లు. లక్ష్మిని అదే గ్రామానికి చెందిన పప్పు వీరారెడ్డి అనే వ్యక్తికి వివాహం చేశారు. రెండు కుటుంబాలు వనపర్తిలోనే నివాసం ఉండేవి.

 

15 సంవత్సరాల క్రితం లింగారెడ్డి కుమార్తె రజిని వివాహ వేడుకలలో భాగంగా లక్ష్మీని ఫోటోకి ఆహ్వానించడం లేదని ఆమె భోజనం చేయకుండా పెళ్లిలో అలిగి వెళ్లిపోయారు. అప్పటినుంచి అక్క తమ్ముడి మధ్య ఏ విధమైనటువంటి మాటలు లేవు.గత రెండు సంవత్సరాల క్రితం లక్ష్మి భర్త వీరారెడ్డి మరణించడంతో అదే సమయంలోనే లింగారెడ్డి అనారోగ్యం పాలయ్య ఆసుపత్రిలో ఉన్నారు.

 

ఇలా లింగారెడ్డి ఆసుపత్రిలో ఉండడంతో తన భార్య కుమారుడు వీరారెడ్డి అంత్యక్రియలకు వెళ్లి వచ్చారు అయితే ఆ సమయంలో అక్కా తమ్ముడు మధ్య కూడా మాటలు లేవు.ఇక వనపర్తి సర్పంచ్ ఆధ్వర్యంలో బలగం సినిమాని ప్రదర్శించారు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఇద్దరిలోనూ మార్పు రావడంతో లింగారెడ్డి గ్రామ పెద్దల సమక్షంలో తన చెల్లి ఇంటికి వెళ్లి ఇద్దరూ కలుసుకున్నారు. ఇలా 15 సంవత్సరాల క్రితం విడిపోయిన అక్క తమ్ముళ్లను బలగం సినిమా కలిపిందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -