Bhuma Akhila Priya: తాజాగా నంద్యాల పోలీసులు టిడిపి సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసులో భాగంగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా నారా లోకేశ్ పాదయాత్ర నంద్యాలో ప్రవేశించిన సందర్భంలో ఏవీ సుబ్బారెడ్డి పై ఒక పథకం అఖిలప్రియ వర్గం దాడికి పాల్పడిందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఏవీ సుబ్బారెడ్డిని నడిరోడ్డు పై ఈడ్చుకుంటూ, తన్నుతున్న తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అలాగే మాజీ మంత్రి అఖిలప్రియ నడిరోడ్డుపై పరుగులు పెడుతూ డైరెక్షన్స్ ఇస్తున్నట్టు వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. దాంతో ఏవి సుబ్బారెడ్డి తనపై అఖిల ప్రియ తనపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా నేడు ఉదయం అఖిల ప్రియను నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. లోకేశ్ పాదయాత్ర శుభమా అని నంద్యాలలో అడుగు పెట్టగానే అఖిలప్రియ అరెస్ట్ జరగడంతో టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు.
అయితే అఖిలప్రియ వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ పాదయాత్రలో సొంత పార్టీ నేతపై దాడికి పాల్పడడం ఏంటటి అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో హైదరాబాద్లో కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా హత్యాయత్నం కేసులో అరెస్ట్ కావడం గమనార్హం.