Akhila Priya: నంద్యాల జిల్లా టిడిపి రాజకీయాలలో అంతర్గత కుమ్ములాట మొదలైందని తెలుస్తుంది. ఆళ్లగడ్డలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అఖిల ప్రియ నంద్యాల రాజకీయాలలోకి తల దూర్చడంతో అక్కడ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి.
భూమా అఖిలప్రియ నంద్యాలలో జోక్యం చేసుకోవడంతో ఆమె అన్న భూమా బ్రహ్మానందరెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అలాగే ఏవీ సుబ్బారెడ్డితో అఖిలప్రియ ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు.
ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గం దాడికి పాల్పడడం ఆ పార్టీలోని కుమ్ములాటలకు నిదర్శనంగా మారింది.ఏవి సుబ్బారెడ్డి దాడి ఘటనపై అఖిలప్రియ వారం రోజులపాటు జైల్లో కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఘటన అంతటితో ముగిసిపోలేదు. ఈ క్రమంలోనే అఖిలప్రియ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు కోడలిపై పరువు నష్ట ధావా వేశారు.
ఉమామహేశ్వర రావు కుమారుడు సిద్ధార్థకు ఏవి సుబ్బారెడ్డి కుమార్తె ఏవి జస్వంతి రెడ్డితో వివాహం జరిగింది వీరిద్దరూ అమెరికాలో నివసిస్తుంటారు. అయితే తన తండ్రి అయిన ఏవి సుబ్బారెడ్డి పై దాడి జరగడంతో ఆయన కుమార్తె జస్వంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ అఖిలప్రియ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా అఖిలప్రియను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జస్వంత్ రెడ్డి వీడియో చేయడంతో మండిపడిన అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి ఆయన కుమార్తె జస్వంతి రెడ్డి పై ఆళ్లగడ్డలో పరువు నష్ట ధావ వేసింది. అయితే అఖిల ప్రియ ఎంత మొత్తానికి పరువు నష్ట ధావ వేసింది అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. దీంతో ఏవీ, అఖిలప్రియ మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరినట్టైంది. ఇప్పటికే అఖిలప్రియ వ్యవహారశైలిపై బొండా ఉమామహేశ్వరరావు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.