Samantha: సమంతకు అనారోగ్య సమస్యలు రావడానికి అవే కారణమా?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనందరికీ తెలిసిందే. సమంత అనారోగ్య పరిస్థితుల రీత్యా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే ఆ అనారోగ్య సమస్యల నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. ఇటీవల పలు దేశాలు తిరిగి తన మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ తన బిజినెస్ లు, ఫౌండేషన్స్ చూసుకుంటోంది సమంత. త్వరలోనే సామ్ మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేసిన విషయం తెలిసిందే.

 

ప్రస్తుతం తన ఫిట్నెస్ విషయంపై ప్రత్యేకంగా జాగ్రత్తలు వహిస్తూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది సమంత. తరచూ ఏదో ఒక పోస్ట్ తో సోషల్ మీడియాలో నిలిచే సమంత తాజాగా మరోసారి మరో పోస్ట్ తో సోషల్ మీడియాలో నిలిచింది. తాజాగా ఫ్లవర్ బొకేతో ఒక ఫోటో షేర్ చేసిన సమంత ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ఎవరో ఫ్లవర్ బొకే ఇస్తే దాంతో సమంత ఫోటో దిగి ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి ఇలాంటివి చూసినప్పుడు మిక్స్‌డ్ ఫీలింగ్స్ కలుగుతాయి.

 

ఎందుకంటే లాస్ట్ టైం వీటివల్లే నేను ఎమర్జెన్సీ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది. ఎవరికి పూలంటే ఎలర్జీ ఉంది అని పోస్ట్ చేసింది. దీంతో సమంత పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ తో సమంతకి పూలంటే ఎలర్జీ అని, గతంలో పూల వల్లే సామ్ హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఆ పోస్టుపై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే అభిమానులు సమంతా మళ్ళీ సినిమాలలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే సామ్ మాత్రం ఇంకా ఏ సినిమాలు ఓకే చేయలేదని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -