ఐ-టిడిపి క్యాడర్ కు చంద్రబాబు బంపర్ ఆఫర్.. పోస్ట్ పెడితే ఏకంగా రూ.100 ఇస్తానంటూ?

ప్రస్తుతం టీడీపీ సోషల్ మీడియా విభాగం వైస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాను ఎదుర్కోవడానికి నానా తంతాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబు ఐటిడిపి కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకముందు సోషల్ మీడియా ఒక్కో పోస్టుకు ఇచ్చే దానికంటే ఎక్కువ రేటు ఇస్తామని పోస్టుకు రూ. 100 ఇస్తామని ఇకముందు ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లో పోస్టులను పెంచాలని, అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యంగా పని చేయాలని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది.

ఈ విషయంలో వెనకా ముందూ చూడొద్దని, అధికార ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేయాలనీ ఆదేశించినట్లు తెలుస్తోంది. రెడ్లు అందరిని రౌడీలు గాను, సీమ ప్రజలు సీమ నాయకులంతా గూండాలు అన్నట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆంధ్రాలో అరాచకానికి, హింసను రేపేందుకు సీమ నుంచి ముఠాలు దిగాయని ప్రచారం చేయాలని అయన సూచించారని, ఈ విషయంలో ఉత్సాహంగా ప్రచారం చేయాలనీ, తమకు ఎన్నికలకు కేవలం వంద రోజులు సమయం మాత్రమే ఉందని అత్యంత వేగంగా ఈ దుష్ప్రచారం చేయాలనీ బాబు సూచించినట్లు తెలుస్తోంది.

అటు తమకు అనుకూలమైన మీడియా, ఛానల్స్ లో సొంత కథనాలు ఇస్తున్నామని, అయితే వాటికి విశ్వసనీయత తగ్గిన నేపథ్యంలో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి ఇలా ప్రచారం చేయాలనీ అయన వారిని ఉత్సాహపరిచినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఈ విధంగా అబద్ధపు ప్రచారాలు చేయమని సూచించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఈ వార్తలపై టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి..

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -