CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి ఘటనలో భాగంగా పోలీసులు పలువురు అనుమానితులను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నటువంటి వేముల దుర్గారావును సైతం అరెస్టు చేయడంతో తన కుటుంబ సభ్యులు తల్లడిపోతున్నారు.
దుర్గారావు భార్య శాంతి అంగన్వాడి ఆయాగ పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం అయితే తన తండ్రి మంగళవారం నుంచి ఇంటికి రాకపోవడంతో అమ్మా నాన్న ఎక్కడ అంటూ వాళ్ళు పదేపదే అడుగుతున్నారని తన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారని విషయం తెలిసి ముద్ద కూడా తినడం లేదంటూ తన భార్య కన్నీటి పర్యంతరమయ్యారు.
తన భర్త ఎలాంటి తప్పు చేయకపోయినా పోలీసులు అరెస్టు చేశారు తన భర్త ఆచూకీ కోసం స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎవరు తన భర్తను చూపించలేదని అలాగే పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళగా అక్కడ ఎవరూ లేరని చెప్పారు అయితే నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లారు తనకు చెప్పాలని డిమాండ్ చేశారు.
తన భర్త ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు అయితే గత మంగళవారం నుంచి తన భర్త ఎక్కడున్నారనే విషయాన్ని కూడా పోలీసులు రహస్యంగా ఉంచారని శాంతి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే దుర్గారావు తెలుగుదేశం పథకాలకు ఆకర్షితుడై గత రెండు నెలల క్రితం బోండా ఉమా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు బోండా ఉమా వెనకే ఉంటూ పార్టీ కోసం కష్టపడుతున్నారు. కేవలం పార్టీ మారారు అన్న నేపథ్యంతోనే తన భర్తను అరెస్టు చేశారని ఈమె ఆరోపణలు చేశారు. మరి నిజంగానే జగన్ విషయంలో దుర్గారావు తప్పు చేశారా లేకపోతే పార్టీ మారారని ఒక కారణంతోనే ఆయన పట్ల యంత్రాంగం వ్యవహరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.