Veera Simha Reddy: ఈ సంక్రాంతి రెండు భారీ సినిమాల ఫైట్ కు వేదికగా మారింది. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య సినిమాలు తలపడ్డాయి. ఒక రోజు గ్యాప్ లో టాలీవుడ్ లో పెద్ద స్టార్లుగా ఉన్న హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదల కాగా.. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ రెండు సినిమాలు మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతున్నాయి.
బాలయ్య బాబు ‘వీరసింహారెడ్డి’గా థియేటర్లలో సందడి చేసిన ఒకరోజు తర్వాత చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా తన హవాను చూపించడానికి వచ్చేశాడు. అయితే బాలయ్య సినిమా పూర్తిగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగగా.. ఇదే తరహాలో గతంలో కూడా సినిమాలు వచ్చాయి. అయితే థియేటర్లలో మెగాస్టార్ సినిమా చూసి వచ్చిన మెగా అభిమానులు కొంతమంది బాలయ్య బాబు సినిమా గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
బాలయ్య బాబు సినిమా గురించి మెగా అభిమానులు కామెంట్ చేస్తూ.. సినిమా అంటే చంపడం, నరకడం ఒక్కటే కాదని అంటున్నారు. సినిమా అంటే అన్ని ఎలిమెంట్స్ ఉండాలని, కామెడీ, డ్యాన్సులు, సెంటిమెంట్ ఇలా అన్ని కలిసి ఉండాలని.. అప్పుడే ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేస్తారని మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కానీ బాలయ్య సినిమాలు ఇలాంటివి లేవని వాళ్లు పరోక్షంగా కామెంట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వేరే లెవల్ లో ఉందని, బాస్ ఈజ్ బ్యాక్ అని, మాస్ మహారాజతో కలిసి దుమ్ము రేపారని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతి విజేత మెగాస్టారే అని గట్టిగా చెబుతున్నారు. కాగా వాల్తేరు వీరయ్య సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళుతున్న విషయం తెలిసిందే.