Navya: స్టేషన్ఘనాపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై జానకీపురం సర్పంచ్ నవ్యమధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సర్పంచ్ ఏకంగా ఎమ్మెల్యే రాజయ్య పై లైంగిక ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.ఈ క్రమంలోనే పోలీసులకు ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసిన సర్పంచ్ ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తు పూర్తి కావడంతో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎమ్మెల్యే రాజయ్య తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ నవ్య ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే పోలీసు విచారణలో భాగంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన రాజయ్యపై లైంగిక ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు తేల్చి చెప్పడం చర్చనీయాంశమైంది. ఇక ఈ వ్యవహారం ముద్రడంతో ఇటీవల రూ.25 లక్షల వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది.
గతంలో తాను చేసిన లైంగిక ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేశానని తనతో అగ్రిమెంట్పై సంతకాలు చేయించే కుట్ర జరుగుతోందని రాజయ్యతోపాటు నవ్య తన భర్త పై కూడా కేసు నమోదు చేసింది. అయితే ఈ వ్యవహార శైలి పార్టీకి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్న ఉద్దేశంతో మహిళ కమిషన్ రంగంలోకి దిగి నిజానిజాలను బయటపెట్టే ప్రయత్నం చేసింది. కేంద్ర మహిళా కమిషన్ కూడా జోక్యం చేసుకుంది. దీంతో నవ్య లైంగిక ఆరోపణలకు ముగింపు పలికేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఇక ఇదివరకు ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తూ ఆయన తనని వేధించాడంట తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఆడియో రికార్డ్స్ వాట్సప్ చాట్ అన్ని కూడా తన వద్ద ప్రూఫ్స్ ఉన్నాయని నవ్య తెలియజేశారు. ఈ క్రమంలోనే పోలీసులు విచారణలో భాగంగా తన వద్ద ఉన్నటువంటి ఆధారాలను సబ్మిట్ చేయాలంటూ నోటీసులు జారీ చేశారు.మూడు రోజులలోపు ఆధారాలన్నింటిని పోలీసులకు అప్పగించాలని నోటీసులు జారీ చేశారు అయితే గడువు పూర్తి అయ్యేలోపు ఆమె ఎటువంటి ఆధారాలను సమర్పించకపోవడంతో ఆమె చేసినటువంటి ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని కేవలం తన రాజకీయ లబ్ధి కోసమే ఎమ్మెల్యే పై ఆరోపణలు చేశారంటూ పోలీసులు వెల్లడించారు.