Madhavi Latha: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో మాధవి లత కూడా ఒకరు. రవిబాబు దర్శకత్వంలో రూపొందిన నచ్చావులే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మాధవి లత మొదటి సినిమాతో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు హిట్ కాకపోవటంతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
ఇలా మాధవి లత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. ఆమె ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మాధవి లత షేర్ చేసే పోస్టులు సంచలనంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా కొందరు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖుల గురించి మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో హీరోయిన్గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా వెల్లడించింది.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలని కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అనే వార్తలు ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో మాధవి లత కూడా ఇలాంటివి ఎదురైనట్టు ఆమె తెలిపింది.
ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ..ఓ కో ఆర్డినేటర్ తనకు ఫోన్ చేసి హీరోయిన్గా మంచి ఆఫర్ ఉంది.. అయితే అవకాశం తనకు దక్కాలంటే ముందు కమిట్మెంట్ ఇవ్వాలి… ఓ రోజు రాత్రి నాతో… ఆ తర్వాత నీ ఫిగర్ గురించి దర్శక నిర్మాతలకు చెపుతానని అన్నాడట.
ఆ వ్యక్తి ఇలా మాట్లాడటంతో వెంటనే అతడిని తిట్టేసి ఫోన్ కట్ చేసినట్లు ఆమె తెలిపింది. ఆ కో ఆర్డినేటర్ చెప్పిన ఆ లిస్టులో పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు కూడా ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత కూడా ఎంతోమంది కో ఆర్డినేటర్లు డైరెక్టుగా ఫోన్ చేసి ఇలా అడిగేవారని మాధవీ చెప్పింది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెళ్లిన వారికి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని అయితే కొందరు అవకాశాల కోసం ఇలాంటి వాటికి లొంగిపోతున్నారని ఆమె తెలిపింది.