Bahubali: ఈ మహిళ బాహుబలిలో అనుష్కకు డూప్ గా చేసిందని మీకు తెలుసా?

Bahubali: టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్,రమ్యకృష్ణ,నాజర్, సుబ్బరాజు వంటి వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిన విషయం కూడా తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో దేవసేన పాత్ర, గెటప్ అన్ని ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాయి.

ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో దేవసేన క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది అనుష్క. మాహిష్మతి సామ్రాజ్యంలో భల్లాల దేవుడు పెట్టే చిత్రహింసలు అనుభవిస్తూ కొడుకు బాహుబలి ఎప్పటికైనా వస్తాడని,బందీగా ఉన్న తనను విడిపించుకుని తీసుకెళ్తాడు అని నమ్మకంతో ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక సెకండ్ పార్ట్ లో యువరాణిగా ఎంతో హుందాగా నటించింది అనుష్క. అయితే ఈ సినిమాలో అనుష్కకి డూప్ గా ఒక హీరోయిన్ నటించింది విషయం చాలామందికి తెలియదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కూడా ఇది నిజం. బాహుబలి సినిమాలో అనుష్కకి డూప్ గా ఒక హీరోయిన్ నటించింది. ఆమె మరెవరో కాదు నటి రుషిక రాజ్.

 

ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 2021 లో విడుదల అయిన అశ్మీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇకపోతే ఈమె బాహుబలి లో అనుష్క కి డూప్ గా నటించింది. లాంగ్ షాట్స్ లో అనుష్కలా కనిపించింది ఈమెనే. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన బాణం ఫైట్లో కూడా ఎక్కువగా నటించింది ఈమెనే. అయితే దూరం నుంచి చూడడానికి అచ్చం అనుష్క లాగే కనిపించడంతో చాలామంది ఈ విషయాన్ని గమనించలేదు. కాగా రిషిక అనుష్క ఇద్దరు ఒకటే సేమ్ హైట్ పర్సనాలిటీ ఉండడంతో ఆమె అనుష్క డూప్ గా నటించింది. అంతేకాకుండా దూరం నుంచి చూస్తే ఇద్దరు ఒకేలా కనిపిస్తారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో చాలామంది అభిమానులు నిజమా అంటూ షాక్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -