NTR: ఎన్టీఆర్ సినిమాకు ఫైనాన్స్ సమస్య.. షాకింగ్ వాస్తవాలివే?

NTR: ఎన్టీఆర్ అభిమానులను ఆతృతగా నిరీక్షింపజేస్తున్న మూవీ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. కొరటాల స్క్రిప్ట్ పై బాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా జనవరి నెల నుండి సెట్స్ పై షూటింగ్ కి వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్టు ప్రకటించడంతో అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి. ఇక సినిమాను అంత స్థాయిలో నిర్మించడానికి భారీ బడ్జెట్ అవసరం అవుతుందని.. అందుకు ఫండింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్టు ఇది వరకే ప్రకటించారు.

 

ఆచార్య సినిమాతో కొరటాల డైరెక్షన్ గ్రాఫ్ కొంత మేర తగ్గిపోయింది. మొదటి సినిమా నుండి కొరటాల గ్రాఫ్ చూస్తే అది గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలో కొరటాల శివ – ఎన్టీఆర్ మూవీకి ఫండింగ్ సమస్య ఏర్పడింది. టాలీవుడ్ కి చెందిన ఒక పెద్ద డిస్ట్రబ్యూటర్ ఈ సినిమాను ఆసరాగా చూపిస్తూ.. భారీ అడ్వాన్స్ అడగడంతో ఈ వార్త బయటకు వచ్చింది. ఇక ఈ సినిమాకు నిర్మాత, కొరటాల మరియు ఇంకో మిత్రునితో కలిసి ఫండింగ్ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.

 

ఇక ఇలాంటి సమయంలో అమెరికాలో ఉన్న ఇక్కడి వాళ్ళకి వల వేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అమెరికాలో బాగా వెనకేసిన మనవాళ్ళు కొందరు.. ఇక్కడి సినిమాలకు అప్పులు ఇస్తారు. తెలుగు ఇండస్ట్రీలో ఓ రెండు మూడు సంస్థలు ఇలాగే ఫండింగ్ పొందుతున్నాయి. ఇక ఈ ప్రయత్నంలో నిర్మాత సక్సెస్ అవుతారనే టాక్ వినిపిస్తుంది. ఇక సినిమా ప్రారంభం అయితే బయ్యర్స్, ఇతర వర్గాల నుండి మరింత ఫండింగ్ అందుతుంది.

 

ప్రస్తుతం ఈ సినిమాకు హీరోయిన్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. జాన్వీ కపూర్ అని గుసగుసలు వినిపిస్తున్నా.. అది అఫీషియల్ గా కన్ ఫర్మ్ కాలేదు. ఒకవేళ అదే నిజమైతే ఫండింగ్ సమస్య సులభంగా తీరుతుంది. జాన్వీ కపూర్ క్రేజ్ తో మరింత మంది పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. ఇక ఎన్టీఆర్ – జాన్వీకపూర్ అనగానే ఆ క్రేజ్ మాములుగా ఉండదు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -