Ganta Srinivasa Rao: విశాఖపట్నంలోని మధురవాడలో తన నూతన కార్యాలయాన్ని గంటా శ్రీనివాసరావు శుక్రవారం నాడు తెలుగుదేశం నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభం చేశారు. ఈ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ప్రస్తుతం తెలంగాణలో బి ఆర్ ఎస్ పరిస్థితి ఎలాగో ఉందో ఏపీలో కూడా వైయస్సార్సీపి పార్టీ పరిస్థితి అలాగే ఉంటుందని తెలిపారు. సీఎం జగన్ వ్యవహారశైలి, ఆయన వ్యక్తిత్వం నచ్చకే వారంతా టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. తనను ఎవరో ఏదో అన్నారని వారికి కౌంటర్ ఇచ్చే శైలి తనది కాదు అంటూ ఈయన తెలిపారు.
అందరిలా తాను భయపడే వ్యక్తి కాదని రాజకీయాలలో తనకంటూ ఒక స్టైల్ ఉందని ఈయన తెలిపారు. వైసీపీ నేతలను తాను బెదిరిస్తున్నానని అవంతి శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తే పార్టీ మారుతారనేది ఒక భ్రమ అని చెప్పారు. అలాంటి పనులు వైసిపి చేస్తుందని తాము కాదని వెల్లడించారు జగన్ వ్యవహరి శైలి నచ్చకపోవడంతోనే ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు తమ పార్టీలోకి వచ్చారని ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.